‘గుంటూరు కారం’ : ఒటిటి రిలీజ్ పై లేటెస్ట్ ఇంట్రస్టింగ్ బజ్

‘గుంటూరు కారం’ : ఒటిటి రిలీజ్ పై లేటెస్ట్ ఇంట్రస్టింగ్ బజ్

Published on Dec 28, 2023 2:18 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రఘుబాబు, సునీల్, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్, రెండు సాంగ్స్, లేటెస్ట్ పోస్టర్స్ అందరినీ ఆకట్టుకుని ఉన్న అంచనాలు మరింతగా పెంచేసాయి. జనవరి 12న థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ యొక్క ఓటిటి రైట్స్ ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ వారు భారీ ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. విషయం ఏమిటంటే, గుంటూరు కారం మూవీ ఓటిటిలో అందుబాటులోకి వచ్చేది థియేట్రికల్ రిలీజ్ అయిన 60 రోజుల అనంతరమే అని, ఆ విధముగా నెట్ ఫ్లిక్స్ వారు ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. మరి అందరిలో మంచి హైప్ ఏర్పరిచిన గుంటూరు కారం మూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు