మాస్ మహారాజా రవితేజ చివరిగా నటించిన ఖిలాడీ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు నటుడు తన తదుపరి చిత్రం రామారావు ఆన్ డ్యూటీ పై చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ చిత్రం జూలై 29న థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కానుంది. నిన్న మేకర్స్ ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేసారు. 24 గంటల్లో 11 మిలియన్ వ్యూస్తో రవితేజ కెరీర్లో అత్యధికంగా వీక్షించిన ట్రైలర్గా నిలిచింది.
అద్భుతమైన ట్రైలర్ కట్తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రం నటుడి కెరీర్లో మరో బ్లాక్బస్టర్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ మరియు ఆర్టి టీమ్వర్క్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించగా, వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్కి సామ్ సిఎస్ సంగీతం అందించాడు.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి