పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘రచ్చ’ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా కార్యరూపం దాల్చనుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న తాజా సమాచారం ప్రకారంఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనుంది. పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ ఈ సినిమాకి నిర్మాత. కానీ ఈ సినిమాలో కాజల్ ని ఎంపిక చేసుకున్నట్టు అధికారికంగా తెలియజేయలేదు.
సొసైటీ, పాలిటిక్స్ లో జరుగుతున్న అవినీతి నేపధ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ డైరెక్షన్లో చేస్తున్న ‘సరదా’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు, ఇది పూర్తి కాగానే సంపత్ నంది సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. అధికారికంగా ప్రకటించగానే మరిన్ని విషయాలను మీకు తెలియజేస్తాము.