ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ ఫిక్స్ ?

ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ ఫిక్స్ ?

Published on Nov 22, 2021 11:00 AM IST

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా సినిమా పై ఓ కొత్త రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, ఈ వార్త వినడానికి అయితే వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. నిజానికి ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకోబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.

ఐతే, తాజా వార్త ప్రకారం కియారా అద్వానీ ప్లేస్ లో జాన్వీ కపూర్ వచ్చింది. ప్రస్తుతం కొరటాల స్క్రిప్ట్ వర్క్ పై కూర్చున్నాడు. తాజాగా ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ లో కొరటాల కొన్ని మార్పులు చేస్తున్నాడట. ఏప్రిల్‌ 22, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. పైగా ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు