రీజనల్ సినిమాతో ఓటిటిలో మహేష్ బాబు ర్యాంపేజ్.!

రీజనల్ సినిమాతో ఓటిటిలో మహేష్ బాబు ర్యాంపేజ్.!

Published on Mar 6, 2024 3:36 PM IST

మన టాలీవుడ్ సినిమా దగ్గర అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా మంచి మాసివ్ క్రేజ్ ఉన్న అతి కొద్ది మంది హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. మరి మహేష్ బాబు హీరోగా తన హ్యాట్రిక్ దర్శకుడు త్రివిక్రమ్ తో చేసిన లేటెస్ట్ చిత్రమే “గుంటూరు కారం”. మరి ఈ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా కేవలం రీజనల్ గా మాత్రమే వచ్చింది.

అలా రావడమే కాకుండా మిక్స్డ్ టాక్ తో కూడా మహేష్ బాబు అండ్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ సెన్సేషన్ సెట్ చేసింది. అయితే ఈ చిత్రం తరువాత దొగ్గజా స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి పాన్ ఇండియా భాషల్లో వచ్చింది. మరి ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ లో అయితే ఇప్పుడు రికార్డు రెస్పాన్స్ నమోదు అయ్యినట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమాకి ఓటిటి ఒక్క నెట్ ఫ్లిక్స్ లోనే 4.9 మిలియన్ వ్యూస్ ని టచ్ చేసినట్టుగా వైరల్ అవుతుంది. దీనితో ఈ చిత్రం రీజనల్ గా వచ్చిన చిత్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ వ్యూవర్ షిప్ ని అయితే కొల్లగొట్టింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు