విన్ తర్వాత మళ్ళీ నెగిటివ్ తెచ్చుకున్న పల్లవి ప్రశాంత్.!

విన్ తర్వాత మళ్ళీ నెగిటివ్ తెచ్చుకున్న పల్లవి ప్రశాంత్.!

Published on Dec 20, 2023 12:03 PM IST

రీసెంట్ గానే మన తెలుగు స్మాల్ స్క్రీన్ సెన్సేషనల్ రియాలిటీ షో అయినటువంటి “బిగ్ బాస్” షో ఏడవ సీజన్ కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్లో ఒక కామన్ మ్యాన్ గా వెళ్లి టైటిల్ విన్ అయ్యాడు కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్. అయితే తనపై మొదటి నుంచి కూడా ఒక సింపతీ కార్డు ఉంది కానీ తర్వాత తన గేమ్ తో షో వీక్షకులని ఆకట్టుకుని గేమ్ విన్నర్ గా నిలిచాడు.

అయితే ఆ గేమ్ తో హౌస్ లో ఉన్నంతవరకు తాను తెచ్చుకున్న పేరుని పోగొట్టుకోడానికి తనకి ఎంతో సమయం పట్టలేదు. హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత తాను చేసిన రచ్చ కోసం ఇప్పటికీ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అంతే కాకుండా శాంతి భద్రతలను తాను పట్టించుకోకుండా ప్రవర్తించడం తనపై మరింత నెగిటివ్ ని సోషల్ మీడియాలో గట్టిగా కనిపిస్తుంది. దీనితో తనపై మరింత విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు