డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకుంది. పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కి గానూ, ఎంఎం కీరవాణి సంగీతం అందించిన నాటు నాటు పాట ఎన్నికైంది.
అయితే ఆస్కార్ బరిలో నిలవడం పట్ల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ సినీ పరిశ్రమ కి ఇది చారిత్రాత్మక ఘట్టం అని అన్నారు. తొలిసారిగా ఒక ఇండియన్ సాంగ్ అకాడమీ అవార్డ్స్ కి ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎస్ ఎస్ రాజమౌళి గారు, ఎంఎం కీరవాణి గారు ఇది మీ విజన్, మ్యాజిక్ అంటూ కొనియాడారు. నాటు నాటు సాంగ్ ఎంపిక కావడం పట్ల సినీ ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
What a historic moment for the entire Indian Film Industry… Couldn’t be more honoured to note that #NaatuNaatu becomes the first Indian song to be shortlisted for the Academy Awards! @ssrajamouli garu and @mmkeeravaani garu, it’s all your vision and magic..????❤️ #RRRForOscars pic.twitter.com/hdJuce16Zl
— Ram Charan (@AlwaysRamCharan) December 22, 2022