రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన సాయి పల్లవి !

రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన సాయి పల్లవి !

Published on Jan 8, 2019 8:50 AM IST


శర్వానంద్ , సాయి పల్లవి నటించిన రొమాంటిక్ ఎంటర్టైనెర్ ‘పడి పడి లేచె మనసు’ ఇటీవల విడుదలై అనుకున్నంతగా విజయం సాదించలేకపోయింది. దాంతో ఈ చిత్ర నిర్మాతలకు సాయి పల్లవి తను తీసుకున్న రెమ్యూనరేషన్ ను వెనక్కి ఇచ్చేసిందట. ఇండస్ట్రీ లో స్టార్ హీరోలు తమ సినిమాలు బాగా ఆడనప్పుడు ఈ వింధంగా రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన సందర్బాలు చాలానే చూసాం. కానీ ఒక హీరోయిన్ కూడా నిర్మాత గురించి అలోచించి తన పారితోషికాన్ని తిరిగి ఇచ్చేయడం బహుశా ఇదే మొదటి సారి అనుకుంటా.

ఇక ఈసినిమాకి గాను నటన విషయంలో శర్వానంద్ , సాయి పల్లవి కి చాలా మంచి పేరు వచ్చింది. వారిద్దరూ సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసిన ఎందుకో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. ఇక సాయి పల్లవి ప్రస్తుతం తమిళంలో సూర్య సరసన ఎన్ జి కె చిత్రంలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు