విలన్ గా సంజయ్ దత్ ఫైనల్… అందుకే ఆ కామెంట్స్ చేశాడా ?

విలన్ గా సంజయ్ దత్ ఫైనల్… అందుకే ఆ కామెంట్స్ చేశాడా ?

Published on Oct 25, 2022 8:05 PM IST

మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సినిమాలో మహేష్ కి విలన్ గా సంజయ్ దత్ ను తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఈ పాత్రకి సంజయ్ దత్ అయితేనే సరైన న్యాయం జరుగుతుందని భావిస్తున్నాడు త్రివిక్రమ్. ఈ ఛాన్స్ వచ్చిన తర్వాతే సంజయ్ దత్ సౌత్ సినిమాల పై పాజిటివ్ కామెంట్స్ చేశాడని టాక్ నడుస్తోంది. రీసెంట్ గా సంజయ్ దత్ తనకు సౌత్ సినిమాల్లో ఎక్కువగా నటించాలని ఉందంటూ కామెంట్స్ చేశాడు.

మహేష్ కి విలన్ గా సంజయ్ దత్ నటిస్తుండటంతో ఈ సినిమా పై బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అవుతాయి. మొత్తానికి త్రివిక్రమ్ ఈ చిత్రానికి నటీనటులను ఎంపిక చేస్తున్న విధానం చాలా ఆసక్తికరంగా ఉంది. పైగా పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబుతో పూజా హెగ్డే రొమాన్స్ చేయనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు