లేటెస్ట్: SSMB 28 మూవీ ఓటిటి రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ

లేటెస్ట్: SSMB 28 మూవీ ఓటిటి రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ

Published on Jan 15, 2023 3:00 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబుతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్న లేటెస్ట్ మూవీ SSMB 28. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల పూర్తి కాగా జనవరి 18న సెకండ్ షెడ్యూల్ ను మొదలెట్టనున్నారు. హారికా హాసిని సంస్థ వారు నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ప్రారంభానికి ముందే అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ యొక్క ఓటిటి ప్రసార హక్కులని ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం నెట్ ఫ్లిక్స్ వారు తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అనౌన్స్ చేశారు. కాగా ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అనంతరం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకాభిమానులకి అందుబాటులోకి రానున్నట్లు వారు తమ పోస్ట్ లో తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు