SSMB 29 : అందుకే మహేష్, రాజమౌళి హఠాత్తుగా తిరిగివచ్చారా ?

SSMB 29 : అందుకే మహేష్, రాజమౌళి హఠాత్తుగా తిరిగివచ్చారా ?

Published on Apr 25, 2024 6:05 PM IST

సూపర్ స్టార్ మహేష్ తో త్వరలో జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఇప్పటికే ఈమూవీ కోసం పూర్తిగా తన మేకోవర్ ని మార్చే పనిలో ఉన్నారు సూపర్ స్టార్.

ఇక ఇటీవల ఈ మూవీ యొక్క స్క్రిప్ట్, స్టోరీ వర్క్ కి సంబంధించి హీరో మహేష్, దర్శకుడు రాజమౌళి, నిర్మాత నారాయణ చర్చల కోసం దుబాయ్ వెళ్లారు. అయితే అదే సమయంలో అనుకోకుండా అక్కడ వరదలు రావడంతో వాటిని వాయిదా వేసి వారు ముగ్గురు హైదరాబాద్ చేరారని తెలుస్తోంది. అందుకే హఠాత్తుగా వారు ముగ్గురు తిరిగిరావలసి వచ్చిందని, త్వరలోనే మళ్ళీ విదేశాల్లో స్క్రిప్ట్ చర్చలు సాగనున్నాయని అంటున్నారు. కాగా ఈ భారీ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ మే 31న రానున్నట్లు చెప్తున్నాయి టాలీవుడ్ వర్గాలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు