టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ హీరోగా వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా స్పై యాక్షన్ ఫిల్మ్ గూఢచారి 2. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకె ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి భారీ వ్యయంతో నిర్మిస్తున్నాయి.
ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ యొక్క తాజా షెడ్యూల్ గుజరాత్ లో జరుగుతుండగా నేడు గుజరాత్లోని భుజ్ షూట్ లోని షెడ్యూల్ లో హీరోయిన్ బనితా సంధు జయిన్ అయ్యారు. హీరో హీరోయిన్స్ పై ప్రస్తుతం కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తోంది యూనిట్. మొదటి భాగాన్ని మించేలా మరింత ఇంట్రెస్టింగ్ గా గూఢచారి 2 మూవీ రూపొందుతోందని, తప్పకుండా రిలీజ్ అనంతరం మూవీ పెద్ద విజయం అందుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.