ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “వీరసింహా రెడ్డి”.!

ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “వీరసింహా రెడ్డి”.!

Published on Jan 12, 2023 8:00 AM IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ మాస్ చిత్రం “వీరసింహా రెడ్డి”. భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఆల్రెడీ ఫ్యాన్స్ లో మాస్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాపై అయితే లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది. థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం పోస్ట్ థియేట్రికల్ హక్కులను అయితే ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ కొనుగోలు చేసినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

మరి ఆ సంస్థ వేరే ఏదో కాదు బాలయ్య లాస్ట్ సెన్సేషనల్ హిట్ “అఖండ” స్ట్రీమింగ్ హక్కులు తీసుకున్న ప్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్ స్టార్ వారే ఈ సినిమా హక్కులు కూడా కొనుగోలు చేశారట. దీనితో వీరసింహా రెడ్డి నెక్స్ట్ ఎంట్రీ ఇందులో ఉండనుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు