నాకు విలన్లు బయటే ఎక్కువ – విశాల్

నాకు విలన్లు బయటే ఎక్కువ – విశాల్

Published on Apr 15, 2024 3:27 PM IST

హీరో విశాల్ హీరోగా, డైరెక్టర్ హరి డైరెక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ రత్నం. ఏప్రిల్ 26న ఈ సినిమా థియేటర్ల లో రిలీజ్ కాబోతుంది. కాగా ‘రత్నం’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విశాల్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. త్వరలో తాను రాజకీయాల్లోకి వవస్తానని.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నానని మొన్న విశాల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా తాజాగా ఈ కామెంట్స్ పై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. విశాల్ తన సమాధానంలో భాగంగా ‘తనకు సినిమాల్లో కంటే బయటే విలన్లు ఎక్కువగా ఉన్నారని హీరో విశాల్ కామెంట్స్ చేశాడు. విశాల్ ఇంకా మాట్లాడుతూ.. ‘తన స్వీయ దర్శకత్వంలో తుప్పరివాలన్ – 2 అనే మూవీ చేయనున్నట్లు విశాల్ చెప్పాడు. మే 5న ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు విశాల్ క్లారిటీ ఇచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు