అంతర్జాతీయ స్థాయికి ఏపీ విద్యార్థుల ప్రతిభ

అంతర్జాతీయ స్థాయికి ఏపీ విద్యార్థుల ప్రతిభ

Published on Apr 10, 2024 7:43 PM IST

2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసిపి పార్టీ తరపున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు అప్పటినుండి ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈ ఐదేళ్లలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టారు. ముఖ్యంగా చిన్నారులకు విద్య విషయమై ఆయన ప్రవేశపట్టిన విధానాలు రాష్ట్రంలో ఎందరో చిన్నారుల పాలిటి వరంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలలను, అందులోని విద్యా బోధనా తీరుతెన్నులను అమాంతం మార్చేసిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేదల ఇళ్లలో విద్యా కుసుమాలు పూయిస్తున్నారు. 

నాడు నేడు పేరిట వేలాది పాఠశాలలను ఆధునీకరించడమే కాకుండా ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టడం, టోఫెల్ శిక్షణను సైతం అందిస్తూ పేదల పిల్లలను అంతర్జాతీయ స్థాయికి చేరుస్తున్నారు, దీంతో అంతర్జాతీయ వేదికలతో పాటు ఐక్యరాజ్య సమితి సమావేశాల్లోనూ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు తమ ప్రతిభ చాటుతున్నారు. ఇదే క్రమంలో అంతర్జాతీయ స్థాయి టోఫెల్ పరీక్షకు ఆంధ్ర నుంచి లక్షలమంది పిల్లలు హాజరై తమ ప్రభను చూపించారు. దాదాపు 13,104 స్కూళ్లలో 3,4,5 తరగతులు చదువుతున్న 4,53,265 మంది విద్యార్థులు టోఫెల్ పరీక్షకు హాజరయ్యారు. దీని తరువాత స్థాయిలో నిర్వహించే పరీక్షకు సైతం 5907 స్కూళ్ళకు చెందిన 6,7,8,9 తరగతుల విద్యార్థులు హాజరవుతారు. 

ఇందులో భాగంగా ఏప్రిల్ 12న నిర్వహించే పరీక్షకు 16.5 లక్షలమంది పిల్లలు హాజరు అవుతారని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో మురుగుపరిచిన విద్యాబోధన, ఆంగ్లం మీద పట్టుకోసం ప్రభుత్వం పడుతున్న తపన, కృషి ఇలా సత్ఫలితాలను ఇస్తోందని విద్యాశాఖ పేర్కొంది. ఈ విధంగా జగన్ చేపట్టిన ఈ విద్యా విధానాల వలన అనేకమంది పిల్లలు లబ్ది పొందడంతో పాటు వారి కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు