ఏపీలో గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల

ఏపీలో గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల

Published on Dec 9, 2023 11:42 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో నిరుద్యోగం అనే మాట చాలావరకు వినిపించడం లేదు. ఇక తాజాగా ఏపీలో ఉద్యోగ జాతర మొదలైంది. ఒక్క రోజు వ్యవధిలోనే గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలవ్వడం ఏపీ చరిత్రలోనే సువర్ణాధ్యాయం. ఈ నోటిఫికేషన్ ద్వారా 81 పోస్టులను భర్తీ చేయనుంది జగనన్న ప్రభుత్వం. 9 డిప్యూటీ కలెక్టర్లు, 26 డీఎస్పీ పోస్టులు ఇందులో భర్తీ కానున్నాయి. అలానే 897 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు – 566. జగన్ ప్రభుత్వం హాయంలో 6 లక్షల 16 వేల 323 పోస్టులను ఇప్పటివరకు నియమించింది. ఇన్ని ఉద్యోగాలు గతలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన గత ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ వారిని ఏమాత్రం అడ్డుకోలేదు. జగన్ హయాంలో నిబంధనలు సడలించి సాధ్యమైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేసింది ప్రభుత్వం. 

జగన్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వడం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్ధిక పరిపుష్ఠి కలిగింది. చదువుకున్న ప్రతి విద్యార్ధి మంచి ఉద్యోగం జగనన్న థ్యేయం. విద్యావ్యవస్థ బాగుంటేనే సమాజం తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేది సీఎం జగన్ గారి నమ్మకం. అందుకే గతంలో ఏ ప్రభుత్వం ఖర్చు చేయలనన్ని నిధులు విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. బడి ఈడు పిల్లలు ప్రతి ఒక్కరూ పాఠశాలకు వెళ్ళాలని, అన్ని బడుల్లో నాడు నేడులో భాగంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు జగన్. విద్యకు అగ్రతాంబూలం  ఇచ్చి ప్రతి పేద విద్యార్థి కూడా ఉన్నత విద్య చదువుకోవాలని అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ విద్యబోధన చేసిన గొప్ప కార్యక్రమం చేపట్టారు. జగన్ సర్కార్ చేసిన విద్యా సంస్కరణల సత్ఫలితాలు ఇపుడు ప్రతి పేద, మద్య తరగతి కుటుంబాల వారు చూస్తున్నారు. 

ఇక ప్రజారోగ్య శాఖలో గతంలో ఎన్నడూ లేని విధంగా 50 నెలల్లో 53 వేల 126 పోస్టులను భర్తీ చేశారు. 6 లక్షల ఉద్యోగాల్లో లక్షా 84 వేల 264 పోస్టులు రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేశారు.3 లక్షల 99 వేల 791 పోస్టులు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం జరిగింది. 19 వేల 701 పోస్టులు కాంటాక్ట్ బెసెస్ లో నియామకాలు జరిగాయి. ఇవి కాక మరో 10 వేల 143 ఖాళీ పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతుంది. యూనివర్శిటీల్లో 3500 పోస్టులకు నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. టిడిపి హాయాంలో వైద్య ఆరోగ్య శాఖలో 1693 పోస్టులు మాత్రమే భర్తీ చేయగా సీఎం జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత విలేజ్ క్లినిక్ లు మొదలకుని టీచింగ్ ఆస్పత్రులు ఖాళీ పోస్ట్ అనేది లేకుండా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా 53 వేల 126 పోస్టులని భర్తీ చేసిన ఘనత జగనన్నకే దక్కుతుంది. వీరిలో 3899 మంది స్సెషలిస్ట్ డాక్టర్లు, 2088 మెడికల్ ాఫీతసర్లు, 13540 ఎఎన్ఎమ్ లు గ్రేడ్ 3 పోస్టులతో కలిపి 19527 పోస్టులు శాశ్వత ప్రాతిపదికన నియమాకాలు జరిగాయి.
 
వీటితో పాటు 10032 మంది ఎంఎల్ హెచ్పీలు, 6734 స్టాఫ్ నర్స్ లు, 9751 మంది పారా మెడికల్ సిబ్బంది, 3303 క్లాస్ 4 సిబ్బంది, 249 మంది డీఈవో లతో పాటు మెడికల్ కాలేజీల్లో నియమించిన 1582 ఉద్యోగులు, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 53,126 పోస్టులున్నాయి. ఇది కదా ఉద్యోగా విప్లవం అంటే, టిడిపి హాయాంలో కేవలం వేలల్లో పోస్టులు భర్తీ చేసి చేతులు దులుపుకున్న మాటల ప్రభుత్వం అది. ఇచ్చిన  హమీకి తగ్గకుండా జగనన్న హయాంలో ఆరున్నర లక్షల ఉద్యోగాల నియామకాలు చేసి రాష్ట్రంలో నూతన శకానికి నాంది పలికారు ముఖ్యమంత్రి జగన్. మొత్తంగా నాలుగన్నర ఏళ్ళ జగన్ పారదర్శక పాలనలో 2.14  లక్షల శాశ్వత ఉద్యోగాలను కల్పించి ఏపీ చరిత్రలోనే నూతన ఒరవడికి నాంది పలికారు. ఇక ఈ వృద్ధిని చూస్తుంటే మరొక్కసారి 2024 ఎన్నికల్లో ప్రజలు జగన్ ప్రభుత్వానికి పట్టం కడతారు అనేది స్పష్టం అవుతోందని అభిప్రాయపడుతున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు