నాలుగు సార్లు ఎమ్యెల్యేగా గెలిచిన వ్యక్తికి టీడీపీ పార్టీ ఇచ్చిన విలువ ఇదేనా

నాలుగు సార్లు ఎమ్యెల్యేగా గెలిచిన వ్యక్తికి టీడీపీ పార్టీ ఇచ్చిన విలువ ఇదేనా

Published on Jan 15, 2024 10:39 PM IST

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మరియు ఆయన కుమారుడు నారా లోకేష్ ప్రస్తుతం పార్టీని మరింతగా బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని ప్రాంతాల నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న టీడీపీ పార్టీ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో ముందుకి సాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే పలు ప్రాంతాల నాయకులని కలిసి వారితో ఆయా ప్రాంతాల ప్రజల సమస్యలు, అలానే రాబోయే ఎన్నికల్లో ఎవరిని నియమించి ఏవిధంగా ముందుకు సాగాలని పలువురు ఎమ్యెల్యేలు ఎంపీలతో మాట్లాడుతున్నారు బాబు. 

ఇక తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పంలోని నారావారి పల్లె వచ్చిన బాబు, అక్కడే కుటుంబ సభ్యులతో కలిసి సంబరంగా పండుగని జరుపుకున్నారు. ఇక దొంగఓట్లు, బోగస్ ఓట్ల పై ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన చంద్రగిరి టిడిపి ఎమ్యెల్యే అభ్యర్థి పులివర్తి నానిని కలిసారు. అనంతరం పలువురు టిడిపి నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు బాబు. అయితే ఆ ప్రెస్ మీట్ లో గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా పనిచేసిన దళిత మాజీమంత్రి పరసరత్నం పరిస్థితి చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. 

బాబు ప్రెస్ మీట్ లో సాధారణ వ్యక్తిలా ఎక్కడో వెనుక నిలబడ్డారు పరసరత్నం. ఇక ఆ విధంగా నిలబడ్డ సదరు దళిత ఎమ్యెల్యే పరిస్థితి ఇంత దారుణంగా ఉందని, బాబు సహా మిగతా నాయకులు ఎవరూ కూడా అయనని ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదని, ఆ పార్టీలో కష్టపడి సేవ చేసిన వారికి దక్కే ప్రతిఫలం ఇదని పలువురు విమర్శలు చేస్తున్నారు. కాగా చంద్రబాబు మీటింగ్ లో ఎమ్యెల్యే పరసరత్నం అందరి వెనుక నిలబడి ఉన్న పిక్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు