తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు చర్చలు ఎందుకోసం ?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు చర్చలు ఎందుకోసం ?

Published on Mar 7, 2024 11:55 AM IST

Chandrababu

ఏపీలో మరొక నెల రోజుల్లో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో పలు పార్టీలు మరియు నాయకులు ఎప్పటికప్పుడు తమ విధివిధానాలు సిద్ధం చేస్తూ ప్రజల్లోకి వెళ్లి వాటిని తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. మరోవైపు రానున్న ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్న టిడిపి పార్టీ ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని పలు కుయుక్తులు పన్నుతోంది. 

అటు వైసిపి నేతలు, ముఖ్యమంత్రి జగన్ పై పదే పదే విమర్శలు ఎక్కుపెడుతున్న టీడీపీ పార్టీ, ఆ పార్టీని గద్దె దింపడమే తమ లక్ష్యం అంటోంది. ఇక ఆ పార్టీ అధినేత చంద్రబాబు రానున్న ఎన్నికల్లో విజయం కోసం బిజెపితోను పొత్తు పెట్టుకునేందుకు సంసిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగముగా నేడు ఢిల్లీ వెళ్లి అక్కడి జాతీయ బీజేపీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు చంద్రబాబు. అయితే విషయం ఏమిటంటే,  ఢిల్లీలో బీజేపీ నాయకులను కలవడానికి వెళ్తూ తెలంగాణ బేగంపేట ఎయిర్పోర్ట్ లో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ని కలిశారు చంద్రబాబు. 

కాగా బీజేపీ పొత్తు కోరుకుంటూ కాంగ్రెస్ వాళ్ళతోను బాబు కలవడం పై రాజకీయ వర్గాల్లో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలో ఏపీ ఎన్నికలు రానుండడంతో ఇలా సడన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చంద్రబాబు కలవడం వెనుక మతలబు ఏంటి అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. మరి రానున్న ఎన్నికల్లో టిడిపి, జనసేన ప్రభుత్వాన్ని ఎంతవరకు ఏపీ ప్రజలు విశ్వసిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు