పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ

పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ

Published on Feb 5, 2024 12:37 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ పార్టీ యొక్క పొత్తుతో బరిలో నిలవనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పొత్తు విషయమై సీట్ల ఎంపికలో అటు జనసేన, ఇటు టిడిపి తర్జనభర్జన పడుతోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జనసేన అధిక సీట్లలో పోటీ చేసేందుకు చూస్తోంది. 

మరి పక్కాగా టిడిపి నుండి ఆ పార్టీ వారికి ఎన్ని సీట్లలో పోటీ చేసే అవకాశం లభిస్తుందో, వారి మధ్య ఎటువంటి సయోధ్య కుదురుతుందో చూడాలి. ఇక విషయం ఏమిటంటే, తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ కు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక ప్రెసిడెంట్‌ సీహెచ్‌ హరిరామజోగయ్య ఘాటు లేఖ రాసారు. 

జనసేన పొత్తులో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబును గద్దెనెక్కించడానికి కాపులు సిద్ధంగా లేరని, అలానే బాబుని గెలిపించడం కోసం పవన్ వెంట కాపులు నడవడం లేదని అన్నారు. పొత్తులో భాగంగా గట్టిగా అడిగి సీట్లు సాధించలేని వాడివి రేపు రాష్ట్ర ప్రయోజనాలు ఏరకంగా కాపాడతావు అంటూ తన లేఖలో పవన్ ని దుయ్యబట్టారు జోగయ్య. మొత్తంగా అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య రాసిన ఘాటు లేఖ రాజకీయ వర్గాల్లో జనసేన పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు