రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పలు పార్టీలు అప్పుడే ప్రచారం మొదలెట్టాయి. ఇక గత ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన వైసిపి పార్టీ తరపున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ అప్పటి నుండి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా పేదసాదలకు ఆయన చేసిన సంక్షేమం, అభివృద్ధి రానున్న ఎన్నికల్లో పెద్ద ప్లస్ కానుందని పలు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇక తాజాగా ఏపీ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టిన వైఎస్ జగన్ ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఇక ఈ బస్సు యాత్రలో ఆయనకు వస్తున్న రెస్పాన్స్ ని బట్టి చూస్తే రాష్ట్రంలో జగన్ గాలి బాగా వీస్తుందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ముఖ్యంగా జగన్ ఎక్కువ బలంగా ఉండే రాయలసీమను మించుతున్న గుంటూరు, కృష్ణా ప్రజల అభిమానం. ఆ ప్రాంతాల్లో జగన్ అడుగు పెట్టిన దగ్గర నుండి జనం ప్రభంజనంలా పెరుగుతూ వెళ్తున్నారు.
ముఖ్యంగా గత పాలనలో జగన్ అందించిన సుపరిపాలనకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం ఆయన పర్యటిస్తోన్న గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలు ఆయనకు నీరాజనాలు పడుతుండడం చూస్తుంటే తప్పకుండా వైసీపీ పార్టీ అక్కడ కూడా భారీగా ఓట్లు అందుకునే అవకాశం కనపడుతోంది. మొత్తంగా జగన్ చేపట్టిన బస్సు యాత్రకు అన్ని ప్రాంతాల ప్రజల నుండి బాగా రెస్పాన్స్ వస్తుండడంతో వైసిపి వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.