మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేసేందుకు మరికొన్ని రోజుల్లో సిద్ధం అవుతుంది.
అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి అన్ని సన్నాహాలు సిద్ధం చేస్తున్న మేకర్స్ ఇప్పుడు సినిమా టోటల్ రన్ టైం పై ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ తెచ్చుకోగా ఈ సినిమా టోటల్ గా ఎంతసేపు మెంటల్ మాస్ ట్రీట్ ని ఇస్తుందో తెలిపారు. ఈ సినిమా మొత్తం 162 నిమిషాల 25 సెకండ్ల పాటు ఉంటుంది అని కన్ఫర్మ్ చేసారు.
అలాగే బుకింగ్స్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు తెలిపారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందివ్వగా మహేష్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు సంయుక్తంగా నిర్మాణం అందించిన సంగతి తెలిసిందే.
All set to embrace your immense love and support from May 12th ????????
Get ready to witness Super ⭐@urstrulyMahesh's MENTAL MASS SWAG in Theatres Worldwide ❤️????
Bookings opening in a phased manner across the board ????#SarkaruVaariPaata #SVP #SVPMania pic.twitter.com/0EFKRHlLMQ
— Mythri Movie Makers (@MythriOfficial) May 8, 2022