సముద్రం నేపథ్యంలో సూర్య – బాలా చిత్రం ?

సముద్రం నేపథ్యంలో సూర్య – బాలా చిత్రం ?

Published on May 2, 2022 10:51 PM IST

తమిళ స్టార్ హీరో సూర్య తన తదుపరి సినిమాని స్టార్ డైరెక్ట‌ర్ బాలాతో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా కన్యాకుమారిలో ప్రారంభమైంది. కాగా ఈ సినిమా కథ పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో చాలా భాగం సముద్రం నేపథ్యంలో జరుగుతుందని తెలుస్తోంది. సూర్య పాత్ర కూడా చాలా వైవిధ్యంగా ఉంటుందట.

సూర్య కోసం బాలా మంచి డెప్త్ ఉన్న కథ రాశాడని.. సూర్య కెరీర్ లోనే ఈ చిత్రం స్పెషల్ గా ఉండబోతుంది అని తెలుస్తోంది. సూర్య 41వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఆమె యాక్టింగ్‌ కు ఇంప్రెస్ అయిన బాలా ఈ సినిమాలో హీరోయిన్‌ గా ఆమెను ఫైన‌ల్ చేశారని తెలుస్తోంది. ఒకవేళ ఈ వార్త నిజం అయితే.. కృతి శెట్టి కెరీర్ మరో మెట్టు ఎక్కినట్టే. అలాగే టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. ఐశ్వర్య రాజేష్ కి తెలుగులో మెయిన్ హీరోయిన్ పాత్రలు రాకపోయినా తమిళ మేకర్స్ మాత్రం ఆమెకు మంచి పాత్రలు ఇస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు