లేటెస్ట్ : మహేష్ బాబు – రాజమౌళి ‘SSMB 29’ రూమర్ల పై క్లారిటీ

లేటెస్ట్ : మహేష్ బాబు – రాజమౌళి ‘SSMB 29’ రూమర్ల పై క్లారిటీ

Published on Jan 22, 2024 3:01 PM IST

గుంటూరు కారం విడుదల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల జర్మనీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఇక గుంటూరు కారం అనంతరం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ ప్రాజక్ట్ SSMB 29 లో మహేష్ బాబు నటించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ తో పాటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజక్ట్ కి సంబంధించి కొన్ని రూమర్స్ ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి.

ఈ హై బడ్జెట్ మూవీని నిర్మించడానికి ప్రముఖ తెలుగు నిర్మాత కెఎల్ నారాయణతో కొంతమంది ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు జతకట్టినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే SSMB29 ప్రొడక్షన్ టీమ్‌కి సన్నిహితంగా ఉన్న మా విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ మెగా ప్రాజెక్ట్‌కు కేఎల్ నారాయణ ఏకైక నిర్మాత అని స్పష్టం అయ్యింది. అలానే ఇది ఆయన బ్యానర్ దుర్గా ఆర్ట్స్‌పై మాత్రమే నిర్మించబడుతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న రూమర్స్ మాదిరిగా ఆయన ఈ చిత్రం కోసం మరే ఇతర భారతీయ నిర్మాణ సంస్థతో భాగస్వామ్యం కాలేదని మా వర్గాలు ధృవీకరించాయి.

ప్రఖ్యాత రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే SSMB29 కోసం స్క్రిప్ట్‌ను పూర్తి చేసారు మరియు ఈ చిత్రం అతి త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. దీనికి సంబంధించి ప్రొడక్షన్ టీమ్ తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా మరిన్ని వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడిస్తుంది. ఇదిలా ఉండగా మేకర్స్ ఇంకా కీలక తారాగణం మరియు సాంకేతిక సభ్యులను ఖరారు చేయలేదు. కాగా ఈ భారీ ప్రాజెక్ట్ గురించి మరింత విశ్వసనీయమైన వార్తల కోసం మా 123తెలుగు సైట్ చూస్తూ ఉండండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు