ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “మంగళవారం”.!

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “మంగళవారం”.!

Published on Dec 26, 2023 7:02 AM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా తన డెబ్యూ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి కాంబినేషన్ లో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే “మంగళవారం”. మరి రిలీజ్ కి ముందు ఎన్ని అంచనాలు నడుమ మేకర్స్ ప్రమోట్ చేశారో రిలీజ్ తర్వాత వాటిని అందుకొని ఈ చిత్రం అదరగొట్టింది. ఈ ఏడాది వచ్చిన పలు క్లీన్ హిట్స్ లో ఒకటిగా ఈ చిత్రం కూడా నిలిచింది.

ఇక ఈ చిత్రం అయితే ఇప్పుడు ఫైనల్ గా ఓటీటీ డెబ్యూ ఇచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ + హాట్ స్టార్ వారు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇందులో ఈ చిత్రం నేడు మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఈ చిత్రం హాట్ స్టార్ లో అయితే పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మరి ఈ సాలిడ్ థ్రిల్లర్ ని చూడాలి అనుకునేవారు ఇప్పుడు చూడొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు