త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”

త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”

Published on Dec 14, 2023 5:07 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది. ప్రముఖ టీవీ ఛానల్ అయిన జీ తెలుగు ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ను కలిగి ఉంది.

అయితే త్వరలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం జీ తెలుగు లో ప్రసారం కానుంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం కి రధన్, గోపీ సుందర్ లు సంగీతం అందించారు. మహేష్ బాబు. పి దర్శకత్వం వహించిన ఈ సినిమా బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు