డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిన “పిండం”

డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిన “పిండం”

Published on Jan 26, 2024 11:24 PM IST

రీసెంట్ గా పిండం అనే హారర్ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీరామ్, ఖుషీ రవి ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి నూతన దర్శకుడు సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించారు. మేకర్స్ ఈ సినిమాను అత్యంత భయానక చిత్రంగా ప్రచారం చేశారు. ఈ చిత్రం థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసింది. దాని OTT అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది.

తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం అయిన ఆహా ఇప్పుడు సినిమా ఫిబ్రవరి 2 నుండి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. థియేటర్లలో పిండం చిత్రాన్ని మిస్ అయిన వారందరికీ ఇది మంచి అవకాశం. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఈశ్వరి రావు, అవసరాల శ్రీనివాస్, రవి వర్మ తదితరులు కీలక పాత్రలు పోషించడం జరిగింది. కృష్ణ సౌరభ్ సూరంపల్లి స్వరాలు సమకూర్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు