భూ కేటాయింపుల కేసులో చంద్రబాబుకు చుక్కెదురు

భూ కేటాయింపుల కేసులో చంద్రబాబుకు చుక్కెదురు

Published on Mar 7, 2024 12:10 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల స్కిల్ స్కామ్ కేసులో జైలుకి వెళ్లి బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరొక్కమారు ఆయన మరొక సమస్యలో ఇరుక్కున్నారు. విషయం ఏమిటంటే, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2003 లో ‘ఐఎంజీ భారత’ కు ఎకరం రూ.50 వేల చొప్పున 800 ఎకరాలు కేటాయించడం జరిగింది. దానిపై తాజాగా ఆ భూములు సర్కారువే అని హై కోర్టు స్పష్టం చేసింది. ఆ భూముల కేటాయింపులను రద్దు చేస్తూ వైఎస్ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు. ఐఎంజీ భారత అనే కంపెనీని 2003 ఆగస్టు 5న రిజిస్టర్ చేయగా దానికి అధినేత అహోబలరావు అలియాస్ బిల్లీరావు క్రీడా మైదానాలు కట్టి, 2020 ఒలింపిక్స్ కోసం క్రీడాకారులను సిద్ధం చేస్తామంటూ కంపెనీ ప్రచారం చేసి ప్రారంభించిన నాలుగు రోజులకే ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు, సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి అత్యంత చేరువలో 450 ఎకరాలను కంపెనీకి కేటాయించింది. ఆ సమయంలో అక్కడ సుమారు ఎకరం రూ. 10 కోట్లు ధర పలుకుతుండగా ఎకరం రూ.50 వేల వంతున కేటాయిస్తూ 2003 ఆగస్టు 9న ఉత్తర్వంలు జారీచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కూలిపోయి 2004 వైఎస్సార్ అధికారంలోకి రాగానే ఐఏంజీకి కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నది. ఎలాంటి అనుభవం లేని సంస్థకు ఎలా అప్పగిస్తారంటూ చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే భూ కేటాయింపు రద్దును సవాల్ చేస్తూ సదరు ఐఎంజీ భారత హైకోర్టును ఆశ్రయించింది. 

అప్పటి నుంచి స్టేటస్ కో లో ఉండిపోయింది. సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ ఉత్తర్పులు జారీ చేసింది. 2006 నుంచి నడుస్తున్న ఈ కేసు ఎట్టకేలకు కొలిక్కి రావడంతో రూ. వేల కోట్ల భూమి ప్రభుత్వ ఖాతాలో పడింది. మొత్తంగా ఈ కేసులో తీర్పుతో మరొక్కసారి చంద్రబాబు పై మచ్చ పడింది. మరి రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ఎంతమేర అధికార అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు