ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పై తాజాగా విజయవాడ పర్యటనలో భాగంగా రాళ్ల దాడి జరిగింది. సింగ్ నగర్ లో బస్సు యాత్రలో భాగంగా ఆయన పర్యటిస్తున్న సమయంలో పలు మార్లు అక్కడ పవర్ కట్ అవడం, అనంతరం ఒక్కసారిగా ఒక దుండగుడు క్యాట్ బాల్ తో సీఎం జగన్ పై రాయి విసిరాడం జరిగింది. అది నేరుగా జగన్ మోహన్ రెడ్డి గారి కంటి పై భాగంలో తగిలింది.
తక్షణమే అప్రమత్తం అయిన సెక్యూరిటీ సిబ్బంది ఆయనని బస్సులోపలికి తీసుకుని వెళ్లి ప్రథమ చికిత్స అందించారు. దానితో ఒక్కసారిగా బస్సు యాత్రలో అందరూ నిర్ఘాంతపోయారు. ఇది ముమ్మాటికీ టిడిపి కార్యకర్తల దాడే అని అంటున్నాయి వైసిపి శ్రేణులు. అయితే దాడి జరిగినప్పటికీ కూడా ఎట్టిపరిస్థితుల్లో బస్సు యాత్ర ఆపేది లేదని కొనసాగించారు జగన్. కాగా దాడికి పాల్పడిన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలని వైసిపి శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.