మేలో ఏపీలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే పలు పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసిపి కూడా మరొక్కసారి అధికారంలోకి వచ్చేందుకు సంసిద్ధం అవుతోంది. మరోవైపు నేడు ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ సమాధివద్ద నివాళులు అర్పించిన వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం బస్సు యాత్ర ప్రారంభించారు. ఇక మరోవైపు పలువురు ఇతర పార్టీల నాయకులు, నేతలు వైసిపిలో కొద్దిరోజులుగా చేరుతున్నారు. విషయం ఏమిటంటే తాజాగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు జైభారత్ నేషనల్ పార్టీ మాజీ అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్యదొర.
ఇక ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్రెడ్డి, పెద్దాపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దవులూరి దొరబాబు పాల్గొన్నారు. అలానే నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, ఆయన కుమారుడు చిన్నం చైతన్య కూడా చేరగా వారితో పాటు ఆ కార్యక్రమంలో తుని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దాడిశెట్టి రాజా, ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి కారుమూరి సునీల్, వైఎస్ఆర్సీపీ మైలవరం నేత జ్యేష్ట శ్రీనాథ్ పాల్గొన్నారు. మొత్తంగా రోజురోజుకు వైసిపి పార్టీకి ప్రజల్లో బలం పెరుగుతోదని ఈసారి మరింత ఎక్కువ సీట్స్ అందుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్తున్నాయి వైసిపి వర్గాలు.