ఏపీలో మరోసారి వైసిపిదే  హవా అంటున్న ఎన్ డి టివి సర్వే 

ఏపీలో మరోసారి వైసిపిదే  హవా అంటున్న ఎన్ డి టివి సర్వే 

Published on Apr 18, 2024 12:33 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై ప్రస్తుతం రోజు రోజుకు అందరిలో విపరీతంగా ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే అధికార వైసిపి పార్టీ సహా అన్ని పార్టీలు కూడా ప్రజల్లోకి విరివిగా వెళుతూ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి. ఓవైపు టిడిపి, జనసేన, బిజెపి కూటమి సభలు సమావేశాలు నిర్వహిస్తుంటే మరోవైపు వైసిపి పార్టీ తరపున తాజాగా బస్సు యాత్ర ప్రారంభించిన అధినేత జగన్, ఎక్కడికక్కడ ప్రజలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.

 ఇక జగన్ బస్సు యాత్రకు అన్ని ప్రాంతాల ప్రజల నుండి కూడా బాగా స్పందన లభిస్తుండడంతో వైసిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇంకోవైపు పలు నేషనల్ సర్వే సంస్థలు ప్రస్తుత ఏపీ ప్రజలు వైసిపి వైపే మొగ్గుచూపుతున్నట్లు చెప్తున్నాయి. ఇప్పటికే పలు సర్వేల్లో ఆ విషయం తేటతెల్లం అవగా తాజాగా ఎన్ డి టివి పోల్ ఆఫ్ పోల్స్ 2024 వారు జరిపిన సర్వే ప్రకారం మొత్తం ఏపీలోని 25 ఎంపీ సీట్లలో వైసిపి 16, ఎన్ డి ఏ (బిజెపి+టిడిపి+జేఎస్పీ) 9 సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రకారం 2024లో ఏపీలో వైసీపీదే విజయం అని అంటున్నాయి రాజకీయ వర్గాలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు