పిఠాపురం లో టిడిపి తిరుగుబావుట

పిఠాపురం లో టిడిపి తిరుగుబావుట

Published on Mar 14, 2024 8:06 AM IST

Pita

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా టిడిపి తో జనసేన పార్టీ పొత్తుతో ముందుకు సాగనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా జనసేన కు 21 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. అయితే వాటిలో పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని నేడు కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. దానితో ఒక్కసారిగా అక్కడి స్థానిక తెలుగు తముళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టిడిపి కార్యాలయం వద్ద చంద్రబాబు లోకేష్ ఫ్లెక్సీలు చించిసి కరపత్రాలు తగులబెట్టారు.

అలానే అక్కడ ఐదేళ్ల నుండి ప్రజల కోసం పని చేస్తున్న వర్మ ని కాదని పొత్తులో భాగంగా పవన్ కు ఎలా సీట్ కేటాయిస్తారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం లో పోటీ చేసి ఓడిపోయిన పవన్, ఇప్పటికిప్పుడు సడన్ గా ఇక్కడ పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం ఏంటి అని విమర్శిస్తున్నారు. మరోవైపు వర్మ కూడా నిరాసక్తత వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. 

ప్రస్తుతం ఈ న్యూస్ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. అయితే టిడిపి అధినేత చంద్రబాబు, త్వరలో వర్మని ప్రత్యేకంగా పిలిపించి బుజ్జిన్చే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నాయి పలు టిడిపి వర్గాలు. మొత్తంగా పవన్ పిఠాపురం పోటీ ప్రకటన పెద్ద చిచ్చుని రగిల్చింది అని చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో ఇది ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు