రష్మికకు మోడీ రిప్లై వైరల్.!


ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర సత్తా మంచి వరుస భారీ ఆఫర్స్ అందుకుంటున్న స్టార్ హీరోయిన్స్ లో యంగ్ నటి రష్మికా మందన్నా కూడా ఒకరు. మరి ఇప్పుడు రష్మిక హీరోయిన్ గా “పుష్ప 2” (Pushpa 2) సహా బాలీవుడ్ లో “సికిందర్” (Sikandar) తదితర భారీ చిత్రాలు అనేక భాషల్లో చేస్తుండగా తాను మై ఇండియా అంటూ చేసిన పోస్ట్ రీసెంట్ గా మంచి వైరల్ అయ్యింది. అయితే దీనికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ రిప్లై ఇవ్వడం గమనార్హం.

సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియా నుంచి ఈస్ట్ ఇండియా వరకు అందరి హృదయాలు కలుపుకుంటూ వెళ్ళాలి అంటూ రష్మిక నుంచి ఓ వీడియో పోస్ట్ రాగా దీనికి నరేంద్ర మోడీ నుంచి రిప్లై రావడం ఒక ఊహించని అంశంగా మారింది. మోడీ రిప్లై ఇస్తూ “ఖచ్చితంగా! మనుషుల్ని కలుపుకుంటూ వెళుతూ వారి జీవితాల్ని మెరుగు పరచడం కంటే ఏది సంతృప్తి ఇవ్వదు” అంటూ తెలిపారు. దీనితో ఈ పోస్ట్ కి 12 గంటల్లోపే 90 వేలకి పైగా లైక్స్ వచ్చేయడం విశేషం. దీనితో ఈ పోస్ట్ లు అయితే ఇపుడు వైరల్ గా మారాయి.

ఆకట్టుకుంటున్న పవన్ కుమార్ కొత్తూరి “యావరేజ్ స్టూడెంట్ నాని” ఫస్ట్ లుక్

మెరిసే మెరిసే చిత్రంతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలతో పాటు ఆడియెన్స్ ప్రశంసలు కూడా అందుకున్నారు. అయితే ఈ దర్శకుడు ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. యావరేజ్ స్టూడెంట్ నాని అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగానూ పవన్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ యూత్‌ఫుల్ లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రమోషన్స్‌ను చిత్రయూనిట్ ప్రారంభించింది. ఈ రోజు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ బోల్డ్ అండ్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే హీరో హీరోయిన్ల మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉంటుందో అర్థమవుతోంది. స్నేహా మాలవ్య, సాహిబా భాసిన్‌, వివియా సంత్‌లు హీరోయిన్లుగా నటించారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

పవన్ కుమార్ కొత్తూరి, స్నేహ, సాహిబా భాసిన్, వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు పవన్ కుమార్ కొత్తూరి, నిర్మాతలు పవన్ కుమార్ కె, బిషాలి గోయెల్, సంగీతం కార్తీక్ బి కొడకండ్ల, DOP సజీష్ రాజేంద్రన్, ఎడిటర్ ఉద్ధవ్ SB, సాంగ్స్ కొరియోగ్రఫీ రాజు మాస్టర్, ఫైట్స్ నందు, PRO ఎస్ ఆర్ ప్రమోషన్స్ (సాయి సతీష్) లుగా వ్యవహరిస్తున్నారు.

SSMB29: సంబంధం లేని రూమర్స్ కి చెక్ పెట్టేసిన మేకర్స్


గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అలాగే మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో తెరకెక్కనున్న భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. ఇది మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా తెరకెక్కనుండగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ గ్యాప్ లో కొన్ని రోజుల కితమే ఈ సినిమా క్యాస్టింగ్ డైరెక్టర్ గా విరేన్ స్వామి ఈ భారీ ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యారు అని జాతీయ కథనాలు వచ్చాయి. దీనితో ఈ రూమర్స్ పై మేకర్స్ అఫీషియల్ గా స్పందించారు. నిర్మాణ సంస్థ శ్రీ దుర్గ ఆర్ట్స్ అధినేత కాజా లక్ష్మి నారాయణ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఆ కథనంలో ప్రచురుంచిన వార్తలో అసలు ఎలాంటి నిజం లేదని, క్యాస్టింగ్ విషయంలో వచ్చిన ఆ వార్త పూర్తిగా అవాస్తవం అని తెలిపారు.

అలాగే విరేన్ స్వామికి ఈ ప్రాజెక్ట్ కి అసలు సంబంధం లేదని అతను ఈ ప్రాజెక్ట్ కి ఏ రకంగా కూడా ఇన్వాల్వ్ కాలేదు అని కుండ బద్దలు కొట్టేసారు. అలాగే ఏదైనా విషయం ఉంటే అధికారికంగా తాము మాత్రమే ప్రకటిస్తామని కూడా తెలియజేసారు. సో ఈ భారీ ప్రాజెక్ట్ విషయంలో వచ్చిన వార్తలలో ఎలాంటి నిజం లేదని చెప్పాలి.

తారక్, నీల్ భారీ సినిమాకి పరిశీలనలో క్రేజీ టైటిల్?


ప్రస్తుతం పాన్ ఇండియా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. భారీ హైప్ ఉన్న ఈ సినిమా నుంచి ఈ 19మే న అవైటెడ్ ఫస్ట్ సింగిల్ (Devara First Single) రాబోతుంది. అయితే ఈ సినిమా తర్వాత తారక్ కి ఉన్న సాలిడ్ లైనప్ లో సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో చేయనున్న సినిమా కూడా ఒకటి.

దీనిపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొనగా ఓ క్రేజీ బజ్ ఇప్పుడు వైరల్ గా వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ చిత్రానికి “డ్రాగన్” అనే ఆసక్తికర మరియు పవర్ ఫుల్ టైటిల్ ని లాక్ చేసినట్టుగా ఇప్పుడు వినిపిస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇపుడు ప్రశాంత్ నీల్ “సలార్ 2” (Salaar 2) తో బిజీగా ఉండగా ఎన్టీఆర్ “వార్ 2” (War 2) తో బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తయ్యాక వీరి డ్రాగన్ మొదలు కానుంది. ఇక ఈ భారీ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించనుండగా ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నుంచి సినిమా షూటింగ్ మొదలు కానుంది.

ఓటిటిలో అప్పుడే స్ట్రీమింగ్ కి వచ్చేసిన “కృష్ణమ్మ”..కారణమిదేనా!?


ప్రస్తుతం మన టాలీవుడ్ లోనే అని కాదు మొత్తం ఇండియా వైడ్ గా కూడా సినిమా పరిశ్రమలో సరైన సినిమాలు లేక బాగా డ్రై వాతావరణం నడుస్తున్న అంశం చూస్తూనే ఉన్నాము. అయితే పలు చిన్న చిత్రాలు కొందరు ప్రముఖ నటుల సినిమాలు కూడా వస్తున్నాయి. కానీ మరీ అంత బజ్ ని అవి జెనరేట్ చేయలేకపోతున్నాయి. అలా గత వారపు శుక్రవారం రిలీజ్ కి వచ్చిన చిత్రమే “కృష్ణమ్మ”.

టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా దర్శకుడు వివి గోపాలకృష్ణ తెరకెక్కించారు. మరి ఓ రస్టిక్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం కేవలం ఈ వారం వ్యవధిలోనే ఓటిటిలో వచ్చేసి షాకిచ్చింది. నేటి నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటిటి యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కి వచ్చేసింది. అయితే దీనికి కారణం చాలా మందికి అంతు పట్టడం లేదు.

అయితే దీనికి కారణం థియేట్రికల్ గా బ్రేకీవెన్ అందుకోవడమే అని చెప్పాలి కాబోలు. ఈ వారం లోనే సినిమా బ్రేకీవెన్ కొట్టేసినట్టుగా వార్తలొచ్చాయి. అందుకే ఇక ఓటిటి నుంచి వచ్చే ఆ కొద్ది మొత్తం కూడా నిర్మాతలకి ప్లస్ అవుతుంది అని వారం లోనే రిలీజ్ కి ఇచ్చేసారు. మరి ఈ సినిమాని చూడాలి అనుకునేవారు ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఓటీటీ రివ్యూ : విద్య వాసుల అహం – ఆహాలో ప్రసారం

Vidya Vasula Aham Movie Review in Telugu

విడుదల తేదీ : మే 17, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి, రాజశ్రీ నాయర్, తదితరులు

దర్శకుడు: మణికాంత్ గెల్లి

నిర్మాతలు: నవ్య మహేష్ ఎమ్, రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్ట

సంగీత దర్శకుడు: కల్యాణి మాలిక్

సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి

ఎడిటింగ్: సత్య గిడుతూరి

సంబంధిత లింక్స్: ట్రైలర్

‘ఇండియన్ 2’ క్లైమాక్స్ లో భారీ సర్ ప్రైజ్ !

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని అప్‌డేట్స్‌ వైరల్‌గా మారాయి. ఇంతకీ, ఆ అప్ డేట్స్ ఏమిటో చూద్దాం రండి. ఈ చిత్రానికి మూడో భాగం కూడా ఉండబోతోందని ఇప్పటికే చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం పార్ట్‌ 2తో పాటే మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ రెండు సినిమాలను ఏడాదిలోపే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు టాక్.

అన్నట్టు ఈ మూవీ టీమ్‌ మరో భారీ సర్‌ప్రైజ్‌ ను కూడా ప్లాన్ చేసింది. పార్ట్‌ 2 క్లైమాక్స్ లో మూడో భాగం ట్రైలర్‌ను ప్రదర్శించాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పైగా అదే రోజున పార్ట్‌ 2 విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీని జులై 12కు వాయిదా వేసినట్లు టాక్‌. మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ‘భారతీయుడు 2’ ట్రైలర్‌ రిలీజ్‌ కోసం యూనిట్‌ ఓ భారీ ఈవెంట్‌ను ప్లాన్‌ చేస్తోందట. కాగా ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడీ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, రవివర్మన్‌ ఛాయాగ్రాహకుడుగా వ్యవహరిస్తున్నాడు.

పరశురాముడి పాత్ర పరిస్థితేంటి ?

నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా – నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ‘కల్కి 2898 AD’ అనే ఫాంటసీ సైంటిఫిక్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో పుకార్లు వైరల్ అయ్యాయి. ఆ మధ్య ఈ మూవీ క్లైమాక్స్‌ కు ముందు వచ్చే సన్నివేశాల్లో పరశురాముడిగా జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తాడని మొదట రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత పరశురాముడి పాత్రలో నాగార్జున కనిపిస్తాడని పుకార్లను పుట్టించారు. ఐతే, తాజాగా పరశురాముడి పాత్రలో కూడా ప్రభాసే కనిపిస్తాడని అంటున్నారు.

ఓ దశలో అయితే, పరశురాముడిగా బాలీవుడ్ హీరో దర్శనం ఇస్తాడని టాక్ నడిచింది. మొత్తమ్మీద అసలు పరశురాముడి పాత్రలో ఎవరు కనిపిస్తారు అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. వార్తలు అయితే రకరకాలుగా వస్తూనే ఉన్నాయి. కథ ప్రకారం పరశురాముడి పాత్ర చాలా కీలకం అని తెలుస్తోంది. మరి అలాంటి కీలకమైన పాత్ర పై ఇంతవరకు మేకర్స్ అయితే స్పష్టత ఇవ్వలేదు. మరి పరశురాముడి పాత్ర పరిస్థితేమిటో చూడాలి.

కాగా, ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని తదితరులు నటిస్తున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

నాని తో ‘ద‌స‌రా’ విలన్ మళ్లీ ?

‘ద‌స‌రా’ కాంబో రిపీట్ కానుంది అని ఇప్పటికే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. నాని కోసం శ్రీ‌కాంత్ ఈ సారి కూడా ఓ స‌రికొత్త కథ రాశాడట. దసరా కోసం నానిని ఓ స‌రికొత్త అవ‌తార్‌లో చూపించాడు. అలాగే, దసరాలో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ను కూడా దర్శకుడు శ్రీ‌కాంత్ ఓదెల చాలా కొత్తగా చూపించాడు. టాలీవుడ్ లో షైన్ టామ్ చాకో కి డిమాండ్ పెరగడానికి కూడా దసరా సినిమానే ముఖ్యకారణం.

ఐతే, తాజాగా, శ్రీ‌కాంత్ ఓదెల నానితో చేస్తున్న రెండో సినిమాలో కూడా షైన్ టామ్ చాకో కి ఓ కీలక పాత్ర రాశాడని.. సినిమాలో మెయిన్ విలన్ అతనే అని, కానీ అతని రూపం పూర్తిగా కొత్తగా ఉంటుందని.. గుర్తుపట్టలేని గెటప్ లో షైన్ టామ్ చాకో కనిపిస్తాడని.. షైన్ టామ్ చాకో లుక్‌, మేకొవ‌ర్ ప్రేక్ష‌కుల్ని మెస్మ‌రైజ్ చేస్తాయని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ఈ కథా నేపథ్యం 80వ దశకంలో సాగుతుంది అని, అప్పటి నిజాం పరిపాలనలో సాగిన ఓ పోరాట యోధుడి కథ ఆధారంగా శ్రీ‌కాంత్ ఓదెల స్క్రిప్ట్ రాసుకున్నాడు అని తెలుస్తోంది. అందుకే, నిజ‌మైన నాయ‌కుడికి ఐడెంటిటీ అవ‌స‌రం లేద‌న్న స్లోగ‌న్ ను పోస్ట‌ర్‌పై పెట్టారట. మొత్తానికి ఓ మాస్ లీడ‌ర్ క‌థతో ఈ సారి నాని రాబోతున్నాడు.

‘అఖండ 2’ కోసం చిన్న షెడ్యూల్

‘అఖండ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, ఈ సీక్వెల్ ను ఎన్నికల తర్వాత స్టార్ట్ చేస్తాం అని బోయపాటి ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. ఎన్నికలు కూడా ముగిశాయి కాబట్టి, ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు అంటూ బాలయ్య ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఐతే, వచ్చే నెలలో ఓ చిన్న షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో అఖండ పాత్ర తాలూకు పరిచయ షాట్స్ ను తీసారట. అనంతరం.. మరో రెండు నెలల తర్వాత రెగ్యులర్ షూట్ ను స్టార్ట్ చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు.

అఖండ 2 కోసం అరకు, కొచ్చి లాంటి ప్రదేశాల్లో కొన్ని అద్భుతమైన లోకేషన్స్‌ను మూవీ యూనిట్ పరిశీలించిందట. ఇక కథ ప్రకారం.. సినిమా పూర్తిగా శైవత్వం పై సాగుతుందని.. హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారత దేశం అనే కోణంలో సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. అలాగే..హిందూ దేవాలయాలకు సంబదించిన లింక్స్ తో పాటు దక్షిణ భారత దేశం గొప్పతనాన్ని కూడా ఈ సినిమాలో బాగా ఎలివేట్ చేస్తున్నారని తెలుస్తోంది. ‘అఖండ 2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతునట్లు తెలుస్తోంది.

రెండు డిఫరెంట్ లుక్స్ లో మహేష్ ?

దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే, ఈ సినిమాలో మహేష్ బాబు రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు. అందులో ఒకటి పక్కా మాస్ లుక్‌ అని, ఆ లుక్ లో మహేష్ నిజంగా ప్రేక్షకులకు షాక్ ఇస్తాడని అంటున్నారు. పూర్తిగా రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ తో మహేష్ సరికొత్త గెటప్ లో కనిపిస్తాడట. అన్నట్టు మరో లుక్ విషయానికి వస్తే.. సూపర్ స్టైలిష్ గా హాలీవుడ్ హీరో రేంజ్ లో ఉంటుందట. ప్రస్తుతం ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు.

కాగా ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలుస్తోంది. ఆ మధ్య విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాసే ప్రయత్నం చేశాను. కానీ రాజమౌళి మార్క్ స్క్రీన్ ప్లేనే ఉంటుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

నాకు అలాంటి వాడే కావాలి – జాన్వీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ ప్రస్తుతం ఫుల్ బిజీగా తన కెరీర్ ను కొనసాగిస్తోంది. ఐతే, జాన్వీకపూర్‌ ప్రస్తుతం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ చిత్రం మే31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తొలి పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో జాన్వీ మాట్లాడుతూ.. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పింది.

ఇంతకీ, జాన్వీ కపూర్ ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే విందాం. ‘నాకు కాబోయే భర్త, నా కలలను తనవిగా భావించాలి. ఎప్పుడూ నన్ను సంతోషంగా ఉంచాలి. అలాగే, ఆపదలో నాకు ధైర్యం చెప్పాలి. నేను ఏడ్చినప్పుడు నా పక్కనే ఉండి నాకు అండగా నిలబడాలి. అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటాను’ అంటూ జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. మరి అలాంటి అబ్బాయి, జాన్వీ కపూర్ కి దొరూతాడో లేదో కాలమే సమాధానం చెప్పాలి.

అన్నట్టు గత కొంతకాలంగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్‌ షిండే మనవడు శిఖర్‌తో జాన్వీ కపూర్ డేటింగ్‌లో ఉన్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

‘ఇండియన్ 2’లో రకుల్ పాత్ర అదే !

విజువల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2. ఈ సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఐతే, రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర పై ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఇండియన్ 2 లో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించేది కొన్ని సన్నివేశాలు మాత్రమే. అది కూడా సెకండ్ హాఫ్ లో. ఐతే, రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర సినిమాలో కొద్ది సమయం మాత్రమే ఉన్నా.. చాలా కీలకంగా ఉండబోతుందని.. ఓ సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ గా ఆమె పాత్ర సాగుతుందని తెలుస్తోంది.

ఇక భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు, కాగా ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడీ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ‘భారతీయుడు 2’లో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తోంది. సిద్ధార్థ్‌, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, రవివర్మన్‌ ఛాయాగ్రాహకుడుగా వ్యవహరిస్తున్నాడు.

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ప్రమోషన్స్ షురూ!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ యొక్క కమర్షియల్ ఎంటర్టైనర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎట్టకేలకు మే 31న థియేటర్ల లోకి రానుంది. పెండింగ్ పనుల కారణంగా ఈ చిత్రం చాలాసార్లు వాయిదా పడింది. విశ్వక్ సేన్, ఫహద్ ఫాసిల్ యొక్క ఆవేశంలోని ఐకానిక్ సన్నివేశాన్ని రీ క్రియేట్ చేశాడు. తన చిత్రం ఇక వాయిదా పడదు అని, మే 31 కి థియేటర్ల లోకి వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.

ఈ సన్నివేశంలో, ఫహద్ ఫాసిల్ ఒక ఇన్‌స్టా రీల్‌ కోసం ఒక స్తంభం వెనుక నిలబడి, తన విభిన్న మనోభావాలను ప్రదర్శిస్తాడు. విదేశీ క్రికెటర్లతో సహా పలువురు ప్రముఖులు ఈ ట్రెండింగ్ సన్నివేశాన్ని రీ క్రియేట్ చేసారు. ఇప్పుడు విశ్వక్ సేన్ వంతు వచ్చింది. సరే, ఇది నిస్సందేహంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి మంచి మార్గం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. నేహా శెట్టి, అంజలి కథానాయికలు గా నటిస్తుండగా, నాజర్, సాయి కుమార్, గోపరాజు రమణ, హైపర్ ఆది కీలక పాత్రలు పోషించారు. హిందీ బిగ్ బాస్ సెన్సేషన్ అయేషా ఖాన్ ఓ ప్రత్యేక పాటలో కనిపించనుంది. నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు.

ఆ నటుడి ఇంట విషాదం

జబర్దస్త్‌ హాస్య నటుడు కెవ్వు కార్తిక్‌ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఈ పోస్ట్ కెవ్వు కార్తిక్‌ ఎందుకు పెట్టాడంటే.. ఆయన ఇంట విషాదం నెలకొంది. కొంతకాలంగా కేన్సర్స్‌తో పొరాటం చేస్తున్న ఆయన తల్లి ఈ లోకాన్ని విడిచారు. దీంతో, కెవ్వు కార్తిక్‌ తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ ను పెట్టారు.

‘ఐదు సంవత్సరాలుగా క్యాన్సరే భయపడే విధంగా దానితో పోరాటం చేశావు. నీ జీవితమంతా యుద్థమే. మమ్మల్ని, నాన్నను కంటికి రెప్పలా చూసుకున్నావ్‌. కష్ట పరిస్థితుల్లో కుటుంబాన్ని కాపాడావు. దేనితోనైనా ఒంటరిగా ఎలా పోరాటం చేయాలో ఈ 5 ఏళ్లలో నేర్పించావు. నాలో ధైర్యాన్ని నింపావు. అన్నీ నేర్పావు.. కానీ నువ్వు లేకుండా ఎలా బతకాలో నేర్పలేదు’ అని కెవ్వు కార్తిక్‌ తన ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. అదేవిధంగా తన మాతృమూర్తికి చికిత్స చేసిన డాక్టర్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సరికొత్తగా ఆకట్టుకుంటున్న లవ్ మీ ట్రైలర్

టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ హీరోగా రాబోతున్న హారర్ ప్రేమకథ “లవ్ మీ”. ఇఫ్ యు డేర్ అనేది ట్యాగ్‌లైన్. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. ఈరోజు ఓ ఈవెంట్‌లో మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ప్రేక్షకులను ఈ ట్రైలర్ చాలా బాగా ఆకట్టుకుంది. ట్రైలర్ ను చూస్తుంటే సినిమాలో మంచి కథతో పాటు ఎమోషన్స్ కూడా ఉన్నాయని అర్థం అవుతుంది.

ఏదైతే చేయకూడదు అని చెబుతారో… అలాంటి పనులే చేసే వ్యక్తిగా ఆశిష్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. హీరో ఓ శిథిలావస్థలో ఉన్న భవనానికి వెళ్లి ఒక దెయ్యంతో ప్రేమలో పడతాడు. మానవుడు దెయ్యంతో ప్రేమలో పడాలనే ఆలోచనతో సాగిన ఈ ట్రైలర్ మొత్తానికి ఆకట్టుకుంది. సాంకేతికంగా కూడా ఈ ట్రైలర్ చాలా బాగుంది. హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం ఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

‘వార్ 2’లో మరో బాలీవుడ్ బ్యూటీ ?

‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం భారీ సెట్ వేస్తున్నారు. పైగా కత్రినా కైఫ్ తో ఈ సాంగ్ ను చేయించాలని మేకర్స్ డిసైడ్ అయ్యారని టాక్. మరి ఈ వార్తలో ఎలాంటి వాస్తవం ఉందో చూడాలి.

కాగా, మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘వార్ 2’ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పైగా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్టు ‘వార్ 2’ కథ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. పైగా ‘వార్ 2’ అనేది యాక్షన్ ఫిల్మ్. మరి యాక్షన్ ఫిల్మ్ లో ఎన్టీఆర్ ఏ రేంజ్ నటనతో ఆకట్టుకుంటాడో చూడాలి. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

“ఐశ్వర్యరాయ్” ను అలా చూసి ఆందోళనలో ఫ్యాన్స్!

స్టార్ డైరెక్టర్ మణిరత్నం యొక్క పొన్నియిన్ సెల్వన్ మూవీ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను అబ్బురపరిచిన ఐకానిక్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచ్చన్ కొత్త సినిమాలకు సంతకం చేయలేదు. ఏది ఏమైనప్పటికీ, ఆమె కేన్స్ 2024 ఫిల్మ్ ఫెస్టివల్ లో కనిపించనుంది. ఆమె కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో పాటు, ఐశ్వర్య గత రాత్రి కేన్స్‌కు వెళ్లే మార్గంలో ముంబై విమానాశ్రయంలో కనిపించింది. అయితే ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆమె కుడి చేతికి కట్టుకట్టి ఉంది. చేతికి గాయం అయినట్లు ఆ కట్టు ను చూస్తే తెలుస్తుంది. ఐశ్వర్యరాయ్ వివరాలను వెల్లడించడానికి నిరాకరించింది. ఈ విషయంలో అభిమానులు ఆందోళన చెందారు. తనకు ఏమైంది అనే వివరాలు భవిష్యత్ లో వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

ప్రభాస్ “కల్కి” నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కి సన్నాహాలు…మ్యూజిక్ రైట్స్ డీటైల్స్ ఇవే!


రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మైథాలాజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి2898 ఏ. డి (Kalki 2898AD). దీపికా పదుకునే, దిశా పటాని ఫిమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రం ను జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం కి సంబందించిన మ్యూజిక్ రైట్స్ ను ప్రముఖ మ్యూజిక్ లెబెల్ అయిన సరిగమ సొంతం చేసుకుంది. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ఈ నెలాఖరు లో రిలీజ్ కానుంది. దీనిపై మేకర్స్ నుండి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

వరుణ్ సందేశ్ “నింద” టీజర్‌ను రిలీజ్ చేసిన నవీన్ చంద్ర!


వరుణ్ సందేశ్ మళ్ళీ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈటీవీ విన్‌లో ఇటీవల ఓటిటి చిత్రం అయిన చిత్రం చూడరాలో కనిపించిన తరువాత, తన రాబోయే చిత్రం నింద తో ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వం వహించి ఈ చిత్రం ను నిర్మించారు. కాండ్రకోట మిస్టరీని ఆవిష్కరించే నింద, ఇటీవలే దాని ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. దీనికి అభిమానుల నుండి మంచి ఆదరణ లభించింది.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విజేత, నటుడు నవీన్ చంద్ర విడుదల చేసిన టీజర్ ఆకట్టుకుంటుంది. టీజర్ నైతిక సందిగ్ధతలతో నిండిన కథకు వేదికగా, తనికెళ్ల భరణి డైలాగ్‌తో ప్రారంభమవుతుంది. వరుణ్ సందేశ్ పాత్ర బాగుంది. ఇది నిజం మరియు మోసానికి సంబంధించిన కథను వాగ్దానం చేస్తుంది. అనిల్ కుమార్ చేసిన నైపుణ్యంతో కూడిన ఎడిటింగ్‌తో, నింద టీజర్ చాలా ఎక్కువ బహిర్గతం చేయకుండా అంచనాలను పెంచింది. వీక్షకులను ఆకర్షించి, మరిన్నింటి కోసం ఆసక్తిని కలిగిస్తుంది.

సినిమాటోగ్రాఫర్ రమీజ్ నవీత్ మరియు రీ రికార్డింగ్ ఆర్టిస్ట్ సంతు ఓంకార్‌ల సంయుక్త కృషి టీజర్ ప్రభావాన్ని మెరుగు పరిచింది. ప్రేక్షకులకు అద్భుతమైన దృశ్యమాన అనుభూతిని అందిస్తుంది. తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

“గేమ్ ఛేంజర్” షూటింగ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ ఛేంజర్ (Game changer). తెలుగు చిత్రసీమలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి. ఈ చిత్రం ఇంకా చాలా పార్ట్ షూటింగ్ ను పూర్తి చేయాల్సి ఉంది. నిన్న సాయంత్రం మరో ఇంట్రెస్టింగ్ షెడ్యూల్ పూర్తి అయ్యింది. నటుడు సునీల్ పై డైరెక్టర్ శంకర్ సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ ఈ నెలాఖరు లో షురూ కానుంది. రామ్ చరణ్ పాల్గొనని ఈ షూటింగ్ ను చిత్రీకరించడానికి సెకండ్ యూనిట్ ను నియమించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నరేష్, ప్రియదర్శి, చైతన్య కృష్ణ, ఎస్. జే. సూర్య, జయంరవి, శ్రీకాంత్, సముద్ర ఖని, నాజర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని ఇంకా లాక్ చేయలేదు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరోసారి వాయిదా పడిన బాలీవుడ్ నటి మూవీ!

ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్, చివరిగా తేజస్‌లో కనిపించింది, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేదు. ఆమె రాబోయే ప్రాజెక్ట్, ఎమర్జెన్సీ, ఆమె రెండవ దర్శకత్వ వెంచర్ కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆమె రాజకీయ నాయకురాలు గా మారిన తర్వాత రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నారు. ఈలోగా, ఎమర్జెన్సీ విడుదలకు సంబంధించి చిత్ర నిర్మాణ బృందం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది.

అధికారికంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. కొత్త తేదీ ప్రకటన పెండింగ్‌లో ఉంది. ఎన్నికల కారణంగా కంగనా కీలక షెడ్యూల్ లో పాల్గొనలేదు. మొదట నవంబర్ 24, 2023న విడుదల కావాల్సి ఉంది. అయితే విడుదల జూన్ 14, 2024కి రీ షెడ్యూల్ చేయబడింది, కానీ ఇప్పుడు అది మరోసారి వాయిదా పడింది. ఈ జీవిత చరిత్ర రాజకీయ నాటకంలో శ్రేయాస్ తల్పాడే, అనుపమ్ ఖేర్, భూమికా చావ్లా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మణికర్ణిక ఫిల్మ్స్ బ్యానర్‌పై రేణు పిట్టి, కంగనా రనౌత్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

ముంబై ఇండస్ట్రీ ను సింగిల్ హ్యాండ్ తో చేంజ్ చేశాడు ఆర్జీవీ – ప్రముఖ బాలీవుడ్ నటుడు!


తెలుగులో ఎన్నో సంచలనాత్మక చిత్రాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు రామ్ గోపాల్ వర్మ. కెరీర్ తొలి రోజుల్లో సూపర్ హిట్ చిత్రాలను తెలుగు సినీ పరిశ్రమ కి అందించారు. అయితే టాలీవుడ్ ను వదిలి కొద్ది సంవత్సరాలు బాలీవుడ్ కి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ వర్మ బాలీవుడ్ తల రాతను మార్చే ఎన్నో కల్ట్ చిత్రాలను అందించారు. అయితే తాజాగా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ ఆర్జీవీ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ముంబై ఇండస్ట్రీ ను ఒక నార్త్ ఇండియన్ లేదా, లోకల్ గా ఉన్న వాళ్ళు ఎవరు మార్చలేదు. హైదరాబాద్ నుండి వచ్చిన రామ్ గోపాల్ వర్మ అనే ఒక వ్యక్తి బాలీవుడ్ ను సింగిల్ హ్యాండ్ తో చేంజ్ చేశాడు అంటూ చెప్పుకొచ్చారు. అతను ఎవ్వరికీ భయపడడు, ఇప్పటికీ అని అన్నారు. మనోజ్ బాజ్ పాయ్ కి బీకు మాత్రే లాంటి ఎవర్ గ్రీన్ పాత్రను ఇచ్చింది ఆర్జీవీ నే. ఈ నటుడు బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరొక పక్క ఎంతో ఫేమస్ అయిన ది ఫ్యామిలీ మ్యాన్ తదుపరి సీజన్ లో కనిపించనున్నారు.