సమీక్ష : కృష్ణ‌మ్మ‌ – కొన్ని చోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్!

Krishnamma Movie Review in Telugu

విడుదల తేదీ : మే 10, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: సత్యదేవ్, అతిరా రాజ్, లక్ష్మణ్ మీసాల, రఘు కుంచె, నందగోపాల్ తదితరులు

దర్శకుడు: వివి గోపాలకృష్ణ

నిర్మాత: కృష్ణ కొమ్మాలపాటి

సంగీత దర్శకుడు: కాల భైరవ

సినిమాటోగ్రఫీ:

ఎడిటింగ్:

సంబంధిత లింక్స్: ట్రైలర్

సమీక్ష : “ప్రతినిధి 2” – రొటీన్ పొలిటికల్ యాక్షన్ డ్రామా !

Prathinidhi 2 Movie Review in Telugu

విడుదల తేదీ : మే 10, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: నారా రోహిత్, సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ ఘోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు, ర‌ఘు కారుమంచి త‌దిత‌రులు

దర్శకుడు: మూర్తి దేవగుప్తపు

నిర్మాతలు: కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని

సంగీత దర్శకుడు: మహతి స్వర సాగర్

సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి

ఎడిటింగ్: రవితేజ గిరిజాల

సంబంధిత లింక్స్: ట్రైలర్

సమీక్ష : “ఆరంభం” – ఆకట్టుకోవడంలో విఫలమవుతుంది

Aarambham Movie Review in Telugu

విడుదల తేదీ : మే 10, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: మోహన్ భగత్, సుప్రీత సత్యనారాయణ భూషన్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల, బొడ్డేపల్లి అభిషేక్, సురభి ప్రభావతి

దర్శకుడు: అజయ్ నాగ్ వి

నిర్మాత: అభిషేక్ వి తిరుమలేష్

సంగీత దర్శకుడు: సింజిత్ యర్రమిల్లి

సినిమాటోగ్రఫీ: దేవదీప్ గాంధీ కుండు

ఎడిటింగ్: ఆదిత్య తివారీ, ప్రీతం గాయత్రి

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఓటిటిలోకి వచ్చేసిన విజయ్ ఆంటోని “లవ్ గురు”

విలక్షణ నటుడు, దర్శకుడు విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ లవ్ గురు. తమిళం లో రోమియో గా థియేటర్ల లోకి వచ్చింది. కొన్ని గంటల క్రితం ఆహా తమిళ్ మరియు ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిర్ణాళిని రవి కథానాయికగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు. రోమియో తెలుగులో లవ్ గురు పేరుతో విడుదలైంది, కానీ తక్కువ బజ్ కారణంగా థియేటర్ల లో ఆడలేదు.

లవ్ గురు ఇప్పుడు ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే తెలుగు వెర్షన్ ఓటిటి స్పేస్‌లోకి వచ్చింది. థియేట్రికల్ మరియు ఓటిటి విడుదల మధ్య గ్యాప్ 30 రోజులు కలిగి ఉంది. లవ్ గురు చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై మీరా విజయ్ ఆంటోని నిర్మించారు. వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి బరత్ ధనశేఖర్ సంగీతం సమకూర్చారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

చిరు కి గ్రాండ్ వెల్కమ్…వైరల్ అవుతోన్న వీడియో!

మెగాస్టార్ చిరంజీవి గారిని కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు తో సత్కరించింది. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో పాటుగా తన నివాసం కి చేరారు. ఈ మేరకు ఇంటి సభ్యుల నుండి గ్రాండ్ వెల్కమ్ లభించింది. పూలు వెదజల్లుతూ, బెలూన్ లతో చిరు కు వెల్కమ్ తెలిపారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. చిరు మనుమరాలు అయిన నివృతి ఈ వీడియో ను ఇన్ స్టాగ్రాం ద్వారా షేర్ చేయడం జరిగింది.

చిరు కు మనుమరాలు గా ఉండటం తను ఎంతో లక్కీ గా ఫీల్ అవుతున్న విషయం ను తెలుపుతూ, కంగ్రాట్స్ తెలిపింది. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావడం పట్ల తెలుగు ప్రజలు, ఫ్యాన్స్, సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తదుపరి విశ్వంభర చిత్రం లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ చిత్రం థియేటర్ల లోకి రానుంది.

ఎన్టీఆర్ గారికి భారతరత్న రావాలి – మెగాస్టార్ చిరంజీవి

తెలుగు సినీ పరిశ్రమ లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) గారు ఎనలేని క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. తన సినిమాలతో ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా, కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి ను పద్మ విభూషణ్ అవార్డు తో సత్కరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ అవార్డు పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అయితే నందమూరి తారక రామారావు గారికి భారతరత్న అవార్డు ను ఇవ్వాలంటూ తెలుగు సినీ అభిమానులు, ప్రజలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలంటూ మెగాస్టార్ చిరంజీవి సైతం తాజాగా వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ గారికి భారతరత్న రావాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని అన్నారు. అంతేకాక ఎంజీఆర్ గారికి వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారికి రావడం అంతకంతా సముచితం, ఆనందదాయకం. నేను ఎదురు చూస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రం తో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ చిత్రం థియేటర్ల లోకి రానుంది.

షూటింగ్ పూర్తి చేసుకున్న కామెడీ ఎంటర్టైనర్ “డార్లింగ్”


టాలీవుడ్ ప్రముఖ నటుడు, కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో, నభా నటేష్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ డార్లింగ్. ఈ చిత్రం ను అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. హనుమాన్‌ చిత్రాన్ని నిర్మించిన నిరంజన్‌రెడ్డి ఈ డార్లింగ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశ్విన్ రామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మళ్ళీ వార్తల్లో నిలిచింది.

ఈ చిత్రం కి సంబందించిన షూటింగ్ నేడు పూర్తి అయ్యింది. ఇదే విషయాన్ని మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం కి సంబందించిన ప్రమోషన్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా, హేమంత్ డైలాగ్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

హైదరాబాద్ లో ప్రారంభమైన అజిత్ కుమార్ “గుడ్ బ్యాడ్ అగ్లీ” షూటింగ్!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్, స్టార్ హీరో అజిత్ కుమార్‌తో తమ కొత్త ప్రాజెక్ట్‌ను ఇటివలే అనౌన్స్ చేసింది. గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్‌తో రూపొందే ఈ తెలుగు – తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో ప్రారంభమైయింది. ఈ కీలక షెడ్యుల్ కోసం ఓ మ్యాసీవ్ సెట్ నిర్మించారు. హీరో అజిత్ తో పాటు కీలక పాత్రధారులు షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఈ చిత్రం 2025 పొంగల్‌కు విడుదల కానుంది.
ఈ చిత్రానికి రచన, దర్శకత్వం అధిక్ రవిచంద్రన్, నిర్మాతలు నవీన్ యెర్నేని-వై రవిశంకర్, బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్, సంగీతం దేవి శ్రీ ప్రసాద్, డీవోపీ అభినందన్ రామానుజం, ఎడిటర్ విజయ్ వేలుకుట్టి, CEO చెర్రీ, స్టంట్స్ సుప్రీం సుందర్, కలోయన్ వోడెనిచరోవ్, స్టైలిస్ట్ అను వర్ధన్, పీఆర్వో వంశీ శేఖర్, మార్కెటింగ్ ఫస్ట్ షో లుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి నెలలో థియేటర్ల లోకి రానుంది.

కన్నడలో “పుష్ప 2” రిలీజ్ డీటెయిల్స్ ఇవే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్. ఈ చిత్రం ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ ను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం ను కన్నడ లో N సినిమాస్ బ్యానర్ రిలీజ్ చేయనుంది. ఇదే విషయాన్ని మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా మూవీ కావడం తో ప్రమోషన్స్ ను మరింత గ్రాండ్ గా ప్లాన్ చేయనున్నారు మేకర్స్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫాహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

పవన్ విషయంలో చిరు మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawankalyan) హీరోగా పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలకి బ్రేక్ ఇచ్చి పవన్ రాజకీయ విషయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి ఈ క్రమంలో పవన్ కి తోడుగా అనేక మంది సినీ ప్రముఖులు హీరోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేశారు. మరి వీరితో పాటుగా పవన్ పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక వీడియో బైట్ రీసెంట్ గా చేశారు.

ఇది వైరల్ గా మారగా తాజాగా చిరు మరోసారి పవన్ పై ఆసక్తికర కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. మొదటగా తాను ఏ రాజకీయ పార్టీ లోనూ లేను అని అలాగే కుటుంబం పరంగా పవన్ కి తాము అంతా ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటామని తెలిపారు. అతడు రాజకీయంగా ఎదగాలనే మనసా, వాచా కోరుకుంటున్నామని చిరు కామెంట్స్ చేశారు.

దీనితో ఈ సరికొత్త కామెంట్స్ పవన్ విషయంలో పద్మవిభూషణ్ చిరంజీవి (Padmavi Vibhushan Chiranjeevi) నిన్న తన పద్మ అవార్డు అందుకున్నాక ఇవాళ తెలిపారు. ఇక దీని తర్వాత చిరు మళ్ళీ తన భారీ చిత్రం “విశ్వంభర” (Vishwambhara) లో బిజీ కానున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

ఓటిటి : గ్లోబల్ ప్లాట్ ఫామ్ తో రామ్ డిజిటల్ ఎంట్రీ?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ఇప్పుడు సాలిడ్ సీక్వెల్ “డబుల్ ఇస్మార్ట్” Double Ismart) చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా ఈ చిత్రంని దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నాడు. అయితే రీసెంట్ గానే ఓ భారీ షెడ్యూల్ కూడా మొదలైంది. ఇక ఇదిలా ఉండగా రామ్ పోతినేని కూడా ఓటిటిలో ఎంట్రీ ఇస్తున్నట్టుగా తాజాగా మేము తెలియజేశాము. ఇక ఇప్పుడు దీనికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

ఓ బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ డిజిటల్ డెబ్యూ ఉండగా ఇది గ్లోబల్ గా ఇతర ఓటిటి యాప్స్ తో పోలిస్తే మంచి రీచ్ ఉన్న దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో రామ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. దీనితో ఓటిటి విషయంలో రామ్ మంచి ప్లానింగ్ లోనే ఉన్నాడని చెప్పాలి. రామ్ అపారమైన టాలెంట్ కలిగినవాడు. మరి తన టాలెంట్ కి తగ్గ సరైన సిరీస్ లాంటిది పడితే డెఫినెట్ గా మంచి ఆరంభం తనకి దక్కుతుంది అని చెప్పడంలో సందేహం లేదు.

కన్నడలో “కల్కి” హక్కులు సొంతం చేసుకున్న భారీ నిర్మాణ సంస్థ


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా దీపికా పదుకోణ్ అలాగే దిశా పటాని (Disha Patani) అలాగే యూనివర్సల్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ బిగ్ ని అమితాబ్ బచ్చన్ ల కలయికలో టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ లెవెల్ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే.

అయితే ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా కల్కి ఇపుడు ఇండియా వైడ్ గా అయితే బిజినెస్ విషయంలో అధికారికంగా తమ డిస్ట్రిబ్యూటర్ లని లాక్ చేసుకుంటుంది. అయితే ఈ సినిమా కన్నడ వెర్షన్ కి సంబంధించి ఇప్పుడు డీల్ లాక్ అయ్యింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు సొంతం చేసుకున్నట్టుగా ఇప్పుడు రివీల్ చేశారు.

కర్ణాటక మొత్తం గ్రాండ్ గా తమ నుంచి ఈ సినిమా ఈ జూన్ 27న విడుదల కాబోతున్నట్టుగా తెలియజేసారు. ఇక ఈ నిర్మాణ సంస్థ నుంచే కేజీయఫ్ (KGF) స్టార్ యష్ (Yash) హీరోగా చేస్తున్న తాజా చిత్రం “టాక్సిక్” (Toxic The Movie) ని తెరకెక్కిస్తున్నారు. అంతే కాకుండా వీరి నుంచి సూర్య “కంగువ” (Kanguva) కూడా రానుండగా గతంలో “అనిమల్” లాంటి భారీ సినిమాలే వచ్చాయి.

తెలుగులో ధనుష్ “రాయన్” ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్రముఖ సంస్థ

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తన స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ చిత్రం “రాయన్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమాని మేకర్స్ తమిళ్ సహా హిందీ మరియు మన తెలుగు భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇపుడు తెలుగు రిలీజ్ సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

ఈ చిత్రం ని తెలుగులో ప్రముఖ నిర్మాత అలాగే డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దగ్గుబాటి సురేష్ బాబు అలాగే ఆసియన్ వారు డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. దీనితో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ ఎల్ పి వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ జూన్ 13న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. మరి చూడాలి ధనుష్ తన స్వీయ దర్శకత్వంలో ఎలాంటి సినిమా చేస్తున్నాడో అనేది.

“ప్రతినిధి” కి మరో సీక్వెల్..!

టాలీవుడ్ ప్రముఖ హీరో నారా రోహిత్ హీరోగా చాలా రోజులు తర్వాత హీరోగా మళ్ళీ తన పొలిటికల్ హిట్ చిత్రం “ప్రతినిధి” కి సీక్వెల్ తో పలకరించేందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో ప్లాన్ చేసిన చిత్రమే ఇది. మరి ఈ సినిమా ఈరోజే థియేటర్స్ లో రిలీజ్ కి తీసుకొచ్చారు. అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రానికి కూడా సీక్వెల్ ఉన్నట్టుగా ఇప్పుడు ఖరారు అయ్యింది.

మరి ఈ సినిమాకి కొనసాగింపు సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అలాగే ఇందుకు పార్ట్ 2 కూడా ఎలా రన్ అయ్యింది అనేది కూడా ప్రధాన అంశంగా తీసుకోవాలి. మరి ప్రతినిధి 2 ఎలాంటి రన్ ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో సిరి లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, సచిన్ ఖేడేకర్ తదితరులు నటించగా మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు. అలాగే కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు సిరి తోట అలాగే సురేంద్రనాథ్ బొల్లినేని లు నిర్మాణం వహించారు.

భారీ ధరకి విజయ్ సినిమా శాటిలైట్ హక్కులు.!?

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రం “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” కోసం అందరికీ తెలిసిందే. ఇది విజయ్ కెరీర్ లో 68వ సినిమాగా తెరకెక్కిస్తుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా ఈ సినిమాకి భారీ బిజినెస్ జరుగుతున్న సంగతి కూడా తెలిసిందే.

అయితే ఇది వరకే ఓటిటిలో సెన్సేషనల్ డీల్ పూర్తి కాగా ఇప్పుడు శాటిలైట్ హక్కులు సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా తాలుకా హక్కులు జీ సంస్థ భారీ మొత్తంలో చెల్లించి సొంతం చేసుకున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. మరి దీని ప్రకారం ఈ చిత్రానికి ఏకంగా 93 కోట్లు చెల్లించినట్టుగా తెలుస్తుంది.

అలాగే ఇది అన్ని భాషలు కలిపి అన్నట్టుగా టాక్. మొత్తానికి అయితే ఈ భారీ చిత్రానికి బిజినెస్ ఊహించని లెవెల్లోనే జరుగుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా ఏ జి ఎస్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

గ్రాండ్ గా “రామ జన్మభూమి” టీజర్ లాంఛ్ ఈవెంట్!

సముద్ర మూవీస్ బ్యానర్ నుండి రామ జన్మభూమి టీజర్ రిలీజ్ అయ్యింది. యువత రాజకీయాలలోకి రావాలి అనే కాన్సెప్ట్ లో వచ్చిన ఈ టీజర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన వి. సముద్ర ఈ రామ జన్మభూమి కి దర్శకుడు, నిర్మాతగా వ్యవహరించారు. రవి శంకర్ కథకి తగ్గట్టుగా మంచి మ్యూజిక్ ని అందించారు.

సీనియర్ హీరో మురళి మోహన్ మాట్లాడుతూ, “ఈరోజు దేశం మొత్తం ఎక్కడ విన్నా జై శ్రీ రామ్ నినాదమే. రామ జన్మ భూమి నిర్మాణం అయ్యాక రోజు లక్షల్లో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు, అలాంటి రామ జన్మ భూమి టైటిల్ తో దర్శకుడు సముద్ర గారు జై సిద్దార్ద్ హీరోగా సినిమా చెయ్యడం చాలా సంతోషంగా ఉంది. సముద్రగారు ఎన్నో హిట్టు సినిమాలు ఇచ్చారు, ఇప్పుడు మళ్ళి ఫార్మ్ లోకి వచ్చారు. కచ్చితంగా ఈ రామ జన్మభూమి కూడా పెద్ద హిట్ అవుతుంది.

బి జే పి ఎంపీ అభ్యర్థి మాధవి లత మాట్లాడుతూ, “ఈరోజు కర్నల్ బిక్షపతి గారు ఫోన్ చేసారు, ఒకప్పుడు కాశ్మీర్లో మిలిటరీ వారి ముఖాల మీద, మోకాళ్ళ మీద రాళ్ళూ వేసే వారు, అందుకని పేస్ షీల్డ్స్ అండ్ క్నీ పాడ్స్ ఇచ్చాము. మోది గారు ఆర్టికల్ 370 ఎత్తేయ్యగానే ఆ రాళ్ళూ విసిరే వాళ్ళే లేరు అని చెప్పారు. ఈ మార్పు అంతా కూడా మోది గారు వల్లనే వచ్చింది. ఎంత మంది దేవుళ్ళు ఉన్నా కూడా మనం రాముడినే ఎక్కువగా కొలవడానికి కారణం రాముడు ఈ భూమి మీద ధర్మ బద్ధంగా ఉంటూ అనేక కష్టాలు అనుభవించారు. రామ జన్మభూమి టీజర్ కొస్తే హీరో తన దేశ భక్తి చాటుకునేలా ఉంది, సినిమా మంచి హిట్టు అవ్వాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

డైరెక్టర్ సముద్ర రావు మాట్లాడుతూ, “ప్రతి గ్రామంలో రామాలయం ఉంటుంది, దేవుడే రాముడిగా వచ్చినా మానవుడిగా ధర్మ బద్దంగా బ్రతికారు, ఒక దేశానికి రాజుగా, ఒక తండ్రికి మంచి బిడ్డగా, తమ్ముళ్ళకి అన్నగా ఇలా ధర్మ బద్ధంగా బ్రతికి మనకి చూపించారు. ప్రతి పౌరుడు రాముడిలా బ్రతకాలి, ధర్మంగా మెలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, రాజకీయాలలోకి యువత కచ్చితంగా రావాలి అనే సందేశంతో ఈ సినిమా చేస్తున్నాను” అని అన్నారు.

హీరో జై సిద్ధార్థ్ మాట్లాడుతూ, “ఇండస్ట్రీకీ సింహరాశి, శివ రామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, సేవకుడు, పంచాక్షరీ, మహానంది లాంటి గొప్ప సినిమాలని అందించిన వి. సముద్ర గారి దర్శకత్వంలో నా రాముడి పేరుతో వచ్చిన రామ జన్మ భూమి సినీమాతో నేను హీరో గా లాంచ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. రాముడు ఎప్పుడో మనకి నేర్పిన వాటిని మనం ఎప్పుడూ తప్పకుండా పాటించాలి, అలా పాటించడం మర్చిపోయినప్పుడు, హనుమంతుడు వచ్చి సరి చేసి వెళ్తారు, అందుకే ఇప్పుడు నరేంద్రమోది గారు హనుమంతుని రూపంలో వచ్చి మన దేశాన్ని గాడిలో పెడుతున్నారు. అలాగే లోకల్ లో చాలా మంది చిన్న చిన్న రాక్షసులు ఉంటారు వాళ్ళని లైన్ లో పెట్టడానికి యువత రాజకీయాలలోకి రావాలి అనేది మా కథ” అని అన్నారు.

మా రామ జన్మ భూమి అప్డేట్స్, రిలీజ్ డేట్ ముందు ముందు మరెన్నో ఇచ్చి ప్రేక్షకులని ఇదే రీతిలో అలరిస్తామని చిత్ర యూనిట్ తెలిపారు.

ఈ క్రికెటర్ బయోపిక్ చేసేందుకు సిద్ధం అంటున్న సత్యదేవ్

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి మంచి టాలెంటెడ్ నటుల్లో ఇప్పుడు హీరోగా స్థిరపడుతున్న టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ కూడా ఒకడు. మరి మెగాస్టార్ చిరంజీవి “గాడ్ ఫాథర్” లో సాలిడ్ పెర్ఫామెన్స్ ని అందించాడు. అయితే ఇప్పుడు తాను హీరోగా నటించిన మాస్ యాక్షన్ చిత్రం “కృష్ణమ్మ” తో పలకరించేందుకు వచ్చేసాడు. అయితే సత్యదేవ్ తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఒకటి చేసాడు.

సాధారణంగా పలువురు హీరోలు ఒకవేళ చేయాల్సి వస్తే ఆయా క్రికెటర్లు జీవిత చరిత్ర చేయాలి అనుకుంటాము అని అంటుంటారు. అలా సత్యదేవ్ అయితే మాజీ ఇండియా క్రికెటర్ అందులోని మన తెలుగువాడు అయినటువంటి అంబటి రాయుడు బయోపిక్ ని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆసక్తి కనబరిచాడు. దీనితో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

“యేవమ్” చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌ అభిరామ్‌గా భరత్‌రాజ్‌!

కంటెంట్‌ను నమ్మి చేసిన సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ వుంటుంది. డిఫరెంట్‌ అండ్‌ న్యూ కంటెంట్‌తో రాబోతున్న మా సినిమాపై అందుకే పూర్తి విశ్వాసంతో వున్నాం అంటున్నారు దర్శకుడు ప్రకాష్‌ దంతులూరి. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం యేవమ్‌. చాందిని చైద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌, ఆషు రెడ్డి ముఖ్య తారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు.

ఇటీవల చాందిని చౌదరి, ఆషూ రెడ్డి, వశిష్ట సింహా పాత్రలకు సంబంధించిన లుక్స్‌ పోస్టర్లు విడుదల చేశారు మేకర్స్. తాజాగా ఈ చిత్రంలో మరో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అభిరామ్‌గా కనిపించనున్న భరత్‌రాజ్‌ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. పోలీస్‌ గెటప్‌లో గన్‌ ను ఎయిమ్‌ చేస్తూ అతని లుక్‌ కనబడుతుంది.

ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ, “ఇటీవల విడుదల చేసిన చాందిని చౌదరి, ఆషు రెడ్డి పాత్ర‌లకు సంబంధించిన లుక్స్‌కు మంచి స్పందన వచ్చింది. మహిళా సాధికారికతను చాటి చెప్పే నేప‌థ్యంలో ఈ సినిమా వుంటుంది. ఈ రోజు విడుదల చేసిన అభిరామ్‌ లుక్‌ కూడా అందర్ని అలరిస్తుంది. ఈ పాత్రలో కూడా డిఫరెంట్‌ షేడ్స్‌ వుంటాయి. ఈ చిత్రంలో ప్ర‌తి పాత్ర‌కు ఒక మార్క్ వుంటుంది. కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్‌ నేరేషన్‌తో ఈ సినిమా వుంటుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది” అని అన్నారు.

చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్‌, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌ ఎస్‌వీ విశ్వేశ్వర్‌, సంగీతం కీర్తన శేషు, నీలేష్‌ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన విజయ్ ఆంటోనీ “రోమియో”

కోలీవుడ్ నటుడు సంగీత దర్శకుడు అలాగే దర్శకుడు కూడా అయినటువంటి విజయ్ ఆంటోనీకి తెలుగులో కూడా మంచి ఆదరణే ఉన్న సంగతి తెలిసిందే. అలా తను హీరోగా యంగ్ హీరోయిన్ మిర్నాలిని రవి హీరోయిన్ గా దర్శకుడు వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “రోమియో”. మరి డీసెంట్ రెస్పాన్స్ ని తెలుగు, తమిళ్ లో ఈ సినిమా అందుకుంది. అయితే ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

స్ట్రీమింగ్ యాప్స్ ఆహా అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో లలో ఈ చిత్రం నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. అయితే కేవలం తమిళ్ లో మాత్రమే సినిమా ఇప్పుడు వీటిలో అందుబాటులో ఉంది. “లవ్ గురు” గా తెలుగులో రిలీజ్ కాగా ఈ వెర్షన్ ఇంకా ఓటీటీలో రాలేదు. మరి దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి భరత్ ధనశేఖర్ సంగీతం అందించగా మీరా ఆంటోనీ నిర్మాణం వహించారు.

“దేవర” సాంగ్ ని అక్కడ అనౌన్స్ చేసేసిన అనిరుద్

ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి మేకర్స్ నిన్న రాత్రే అవైటెడ్ ఫస్ట్ సింగిల్ అతి త్వరలో వస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఈ మొదటి పాట పై అకస్మాత్తుగా అప్డేట్ రావడానికి కారణం సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అనే చెప్పాలి.

తను లేటెస్ట్ ఆస్ట్రేలియాలో ఇచ్చిన భారీ కాన్సర్ట్ లో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. తను ఓ న్యూస్ చెప్పబోతున్నాను అని అందరికీ అతి త్వరలోనే దేవర సాంగ్ రాబోతుంది అని ప్రకటించాడు. దీనితో అక్కడ ఈ అప్డేట్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు అభిమానులు అయితే ఈ క్రేజీ కాంబినేషన్లో మొదటి సాంగ్ ని వినేందుకు ఓ రేంజ్ లో ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ఈ భారీ చిత్రం పాన్ ఇండియా భాషల్లో ఈ అక్టోబర్ 10న రిలీజ్ కాబోతోంది.

ఇంట్రెస్టింగ్.. “హను మాన్” నటుడికి సోలో రిలీజ్

ఈ ఏడాదిలో టాలీవుడ్ నుంచి వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం “హను మాన్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంలో యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా నటించగా టాలెంటెడ్ నటుడు గెటప్ శ్రీను కూడా ముఖ్య పాత్రలో కనిపించాడు. మరి డిఫరెంట్ గెటప్స్ మ్యానరిజంలతో అలరించే గెటప్ శ్రీను హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రమే “రాజు యాదవ్”.

దర్శకుడు కృష్ణమాచారి తెరకెక్కించిన ఈ చిత్రం రీసెంట్ గా ట్రైలర్ తో ఆకట్టుకుంది. అయితే హీరోగా ఇది గెటప్ శ్రీనుకి మొదటి సినిమా కావడం విశేషం. మరి ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ మే 17కి లాక్ చేసిన సంగతి తెలిసిందే. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లాంటి హీరో సినిమా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన చిత్రం “సత్యభామ” లాంటి సినిమాలు కూడా ఉన్నప్పటికీ రాజు యాదవ్ ని లాక్ చేశారు.

అయితే ఇప్పటికీ అదే డేట్ లో రాజు యాదవ్ లాక్ అయ్యే ఉంది కానీ ఆ రెండు సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. మరి ఇది గెటప్ శ్రీను సినిమాకి మంచి ప్లస్ అని చెప్పవచ్చు. మరి ఈ ప్రైమ్ టైం లో సోలోగా రిలీజ్ కి వస్తున్నా ఈ చిత్రం ఎలాంటి స్పందనను అందుకుంటుందో చూడాలి.

క్రేజీ టాక్ : ఓటిటిలో ఎంట్రీ ఇవ్వబోతున్న రామ్ పోతినేని!?

మన టాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఒకడు. మరి రామ్ హీరోగా ఇప్పుడు మాస్ ఆడియెన్స్ లో సాలిడ్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. అయితే రామ్ ఇప్పుడు తన సెన్సేషనల్ ప్రాజెక్ట్ “డబుల్ ఇస్మార్ట్” లో బిజీగా ఉండగా ఈ సినిమా తర్వాత రామ్ సాలిడ్ స్టెప్ తీసుకోబోతున్నాడు అని తెలుస్తుంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోస్ బిగ్ స్క్రీన్స్ పై సినిమాలు చేస్తూనే ఓటిటిలో కూడా ఎంట్రీ ఇచ్చారు.

అలా రామ్ కూడా ఓటిటి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి అది కూడా రామ్ ఓటిటి ఎంట్రీ బాలీవుడ్ సర్కిల్స్ నుంచి ఉండబోతుంది అని కూడా వినిపిస్తుంది. మరి ఇది మాత్రం తన ఫ్యాన్స్ కి క్రేజీ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఇపుడు చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తుండగా ఛార్మి, పూరీలు నిర్మాణం వహిస్తున్నారు అలాగే మణిశర్మ సంగీతం అందిస్తుండగా మేకర్స్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాని ప్లాన్ చేస్తున్నారు.

“కన్నప్ప” లో మరోసారి ప్రభాస్ పాత్రపై ఆసక్తి

మంచు వారి యంగ్ హీరో మంచు విష్ణు హీరోగా ఇండియన్ సినిమా దగ్గర భారీ మల్టీ స్టారర్ లా తెరకెక్కిస్తున్న తన డ్రీం ప్రాజెక్ట్ చిత్రం “కన్నప్ప”. మరి ఎన్నో అంచనాలు నడుమ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దీనిని తెరకెక్కిస్తుండగా ఈ సినిమా విషయంలో విష్ణు ఎప్పటికప్పుడు అదిరే అప్డేట్స్ ని అందిస్తూ వస్తున్నాడు.

అలా తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తమ కన్నప్ప సెట్స్ లోకి అడుగు పెట్టినట్టుగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో అప్డేట్ అందించాడు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ ఉన్నాడు అనే టాక్ వచ్చినప్పుడు నుంచే అతడు మహా శివునిగా కనిపిస్తాడు అని రూమర్స్ వచ్చాయి. అయితే తర్వాత బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఎంట్రీతో ఇది మారింది.

ఇక్కడ నుంచి శివుని పాత్రలో అక్షయ్, నందీశ్వరునిగా ప్రభాస్ కనిపిస్తారు అని మరో వెర్షన్ వచ్చింది. అయితే తాజాగా వచ్చిన ప్రభాస్ పోస్టర్ చూస్తే మాత్రం ఇదంతా మారేలా అనిపిస్తుంది. తన కట్టు, అదంతా చూస్తుంటే శివుని పాత్రలో ప్రభాస్ నే కనిపించే ఛాయలు కనిపిస్తున్నాయి. దీనితో మరోసారి ప్రభాస్ పాత్ర విషయంలో మళ్ళీ ఆసక్తి మొదలైంది. మరి చూడాలి విష్ణు ఎవరెవరికి ఎలాంటి పాత్రలు ప్లాన్ చేసాడో అనేది.

దెబ్బ తిన్న కొద్దీ రాటుదేలుతున్న విజయ్ దేవరకొండ.!

టాలీవుడ్ లో ప్రస్తుత యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండకి యువతలో ఎలాంటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్ లో అడుగు పెట్టి 50 కోట్లకి పైగా మార్కెట్ ని ఇప్పుడు తాను సొంతం చేసుకున్నాడు. అయితే విజయ్ సక్సెస్ లో ఉన్నపుడు భారీ ఫేమ్ ని అందుకున్నాడు అలాగే నెగిటివ్ కూడా తనపై వచ్చింది.

కానీ ఇప్పుడు మాత్రం తన హిట్ స్ట్రీక్ కి కొంచెం బ్రేక్ పడింది. లైగర్ నుంచి ఇపుడు ఫ్యామిలీ స్టార్ వరకు తన నుంచి మళ్ళీ తన రేంజ్ హిట్ పడలేదు. దీనితో తన ఫ్యాన్స్ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తుండగా ఈరోజు తన పుట్టిన రోజు కానుకగా అనౌన్స్ చేసిన లైనప్ తో విజయ్ తన కెరీర్ లోనే ఒక కసితో కూడిన లైనప్ అన్నట్టు ఇది అనిపిస్తుంది.

జస్ట్ అనౌన్సమెంట్ లతోనే విజయ్ ఆల్రెడీ హిట్ కొట్టేసాడు అన్న రేంజ్ లో వైబ్స్ కనిపిస్తున్నాయి. వీటితో తాను మాత్రం దెబ్బ తిన్న కొద్దీ రాటుదేలుతున్నాడు తప్పితే అసలు తగ్గేలా ఎక్కడా అనిపించడం లేదు. ఇప్పుడు తన నుంచి రానున్న ఈ పర్టిక్యులర్ మూడు సినిమాలపై మాత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి.

దక్షిణాది సినిమాకి మే 9 ప్రత్యేకం..”కల్కి” కూడా వచ్చుంటేనా

సినిమా అందమైన అబద్దాన్ని నిజంలా చూపిస్తుంది. హృదయాన్ని పిండేసే నిజాన్ని కూడా నిక్కచ్చిగా చూపిస్తుంది. సినిమాతో చేయనిది అంటూ దాదాపు లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సినిమాతో కాలంలో ముందుకూ తీసుకెళ్తుంది వెనక్కీ తీసుకెళ్తుంది తెలిసిన తెలియని జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది. మరి అలాంటి సినిమా పరిశ్రమలో అది కూడా మన దగ్గర ఒక చాలా ప్రత్యేకమైన తేదీ ఉంది, అదే మే 9.

అయితే ముఖ్యంగా ఈ తేదీ మన తెలుగు సినిమా చరిత్రలో ఒక ముఖ్య పాత్రనే పోషించింది అని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మొదలు కొని ఈ డేట్ లో భారీ రికార్డులు ఇండస్ట్రీ హిట్ లు ఉన్నాయి. మెగాస్టార్ నటించిన “జగదేక వీరుడు అతిలోక సుందరి” అలాగే “గ్యాంగ్ లీడర్” అనే సినిమాలతో వరుస ఏడాదిలలో రెండు ఇండస్ట్రీ హిట్స్ కొట్టారు.

ఇక ఈ తేదిలోనే వచ్చిన వెంకీ మామ “ప్రేమించుకుందాం రా”, కింగ్ నాగ్ “సంతోషం” అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) “మహర్షి” లాంటి భారీ హిట్స్ ఈ తేదీన మార్క్ అయ్యాయి. ఇక వీటితో పాటుగా కీర్తి సురేష్ (Keerthy Suresh) నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం “మహానటి” కూడా సంచలన విజయాన్ని అందుకొని తెలుగు సినిమా హిస్టరీలో మరో స్పెషల్ సినిమాకి గుర్తుగా నిలిచింది.

ఇక వీటితో పాటుగా ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ (Director Shankar), యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) కాంబినేషన్ లో వచ్చిన తమిళ సినిమా గేమ్ ఛేంజింగ్ చిత్రం “ఇండియన్” కూడా ఇదే తేదీన రిలీజ్ కావడం విశేషం కాగా శంకర్ కూడా నేడు ఈ స్పెషల్ డే కి ఇండియన్, ఇండియన్ 2 (Indian 2) పోస్టర్ కలిపి గుర్తు చేసుకున్నారు. అయితే సరిగ్గా ఇదే స్పెషల్ డే కి మన తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి మరోసారి చూపించే సినిమా రావాల్సి ఉంది.

ఆ సినిమానే రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” (Kalki 2898 AD). మన తెలుగు సినిమాకి గతం నుంచి ప్రస్తుత కాలానికి అప్పుడు నుంచి భవిష్యత్తుకి ఓ రేంజ్ లోకి మారిన ఈ తేదీన అదే కాల ప్రయాణం కాన్సెప్ట్ తో దర్శకుడు నాగ్ అశ్విన్, అలాగే దిగ్గజ నిర్మాత అశ్వనీదత్ ల కలయికలో తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం రావాల్సి ఉంది. కానీ అనుకోని కారణం రీత్యా సినిమా ఈ తేదీలో రావడం కుదరలేదు.

ఈ ఒక్క సినిమా కూడా పడి ఉంటే మాత్రం తెలుగులో సినిమాలో మే 9 మరింత ప్రత్యేకంగా నిలిచిపోయి ఉండేది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక్కడ మరింత ఆసక్తికర విషయాలు ఏమిటంటే అశ్వనీదత్ నుంచి వచ్చిన సినిమాలు ఆల్రెడీ రెండు (మహానటి, జగదేక వీరుడు అతిలోక సుందరి) ఉండగా ఇప్పుడు కల్కి మిస్ అయ్యింది. అలాగే ఇదే తేదీలో కమల్ నటించిన ఇండియన్ సినిమా రాగా, ఇదే కల్కి సినిమాలో కూడా కమల్ హాసన్ నటిస్తుండడం గమనార్హం. కొంచెం టైం బ్యాడ్ కానీ ఈ డేట్ లో కల్కి పడి ఉంటే వేరే లెవెల్లో ఉండేది ఏమో..

ఫోటో మూమెంట్ : పద్మ విభూషణ్ చిరంజీవితో తన బ్యూటిఫుల్ ఫ్యామిలీ

తెలుగు సినిమా లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భారీ చిత్రం “విశ్వంభర” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా చేస్తున్న సమయంలోనే చిరుకి అత్యున్నత పురస్కారాల్లో ఒకటి అయిన పద్మవిభూషణ్ వచ్చినట్టుగా కేంద్రం ప్రకటించడం విశేషంగా మారింది. అయితే ఈ పురస్కారం అందుకునే కార్యక్రమం నేడు ఢిల్లీలో అట్టహాసంగా జరుగగా ఈ వేడుకల్లో మెగాస్టార్ తో సహా తన భార్య సురేఖ, వారి కుమార్తె సుష్మిత కూడా వెళ్లారు.

అంతే కాకుండా మెగా వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇంకా తన సతీమణి ఉపాసన కూడా వెళ్లారు. అయితే తాజాగా రామ్ చరణ్ పోస్ట్ చేసిన ఓ పిక్ మంచి మూమెంట్ గా మారింది. తన ఇన్స్టాగ్రామ్ తో తమ మొత్తం ఫ్యామిలీ పిక్ షేర్ చేసుకొని తన తండ్రికి ఈ అరుదైన పురస్కారం రావడం ఎంతో ఆనందంగా ఉందని తెలుపుతూ తన తండ్రి విషయంలో గర్విస్తున్నాను అని తెలిపాడు. దీనితో ఈ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

వీడియో కాల్ లో క్రేజీ ఫ్యాన్స్ తో విజయ్ దేవరకొండ

మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో అభిమానులు సినీ ప్రముఖులు తమ శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే. మరి ఈరోజు అంతా తన సైడ్ నుంచి క్రేజీ ప్రాజెక్ట్ ల అప్డేట్ లు కూడా రాగా ఇవి ఫ్యాన్స్ లో మరింత నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి.

అయితే ఫ్యాన్స్ అన్నాక ఏ హీరోకి అయినా తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేస్తారు. అలా విజయ్ దేవరకొండ అభిమానులు కూడా క్రేజీ లెవెల్లో తన పుట్టినరోజు వేడుకలు చేస్తూ ఆఫ్ లైన్ లో రచ్చ లేపేశారు. అలా వారి విజువల్స్ వైరల్ అవుతుండగా వారు విజయ్ దేవరకొండ తమ్ముడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండతో కేక్ కట్ చేయించారు.

మరి అక్కడ అందుబాటులో లేని విజయ్ కి ఆనంద్ వీడియో కాల్ చేసి తన అభిమానులకి ఇవ్వగా ఫ్యాన్స్ తో విజయ్ ముచ్చటించి తనకి ఈ రేంజ్ సెలబ్రేషన్స్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపాడు. అలాగే తమ అభిమాన హీరోతో వీడియో కాల్ మాట్లాడ్డంతో వారి ఆనందానికి కూడా అవధులు లేకుండా పోయాయి. దీనితో సినీ వర్గాల్లో ఈ వీడియో విజువల్స్ వైరల్ గా మారాయి.