త్వరలో మొదలు కానున్న మంచు విష్ణు చిత్రం

చాలా రోజుల నుండి విజయం కోసం ఎదురుచూస్తున్న మంచు విష్ణు పూర్తిగా కామెడి మీదే దృష్టి పెట్టినట్టు ఉన్నారు.

రవి తేజ – సూర్య ల త్రీడి చిత్రం

త్వరలో మాస్ మహారాజ రవితేజ మరియు సూర్య లు కలిసి ఒక ద్విభాషా చిత్రం లో నటించబోతున్నట్టుగా

చంచల్ గూడ జైల్లో ఆటో నగర్ సూర్య<


దేవ కట్టా దర్శకత్వంలో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న చిత్రం ‘ఆటో నగర్ సూర్య’. ప్రస్తుతం ఈ చిత్రం చంచల్ గూడా జైల్లో షూటింగ్ జరుపుకుంటుంది. నాగ చైతన్యకి జోడీగా సమంతా నటిస్తుంది. ఆటో నగర్ సూర్య విజయవాడ పట్టణ నేపథ్యంలో రూపొందుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దేవ కట్టా గతంలో ప్రస్థానం లాంటి పవర్ఫుల్ పొలిటికల్ డ్రామా తీసారు. ప్రస్తుతం ఆటో నగర్ సూర్య లేబర్ యూనియన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా మాక్స్ ఇండియా బ్యానర్ పై కె. అచ్చి రెడ్డి నిర్మిస్తున్నారు. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారు సమర్పిస్తుండగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పొల్లాచ్చి నుండి తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం “గబ్బర్ సింగ్ ” మూడువారాల షెడ్యూల్ పూర్తయ్యింది .

సమీక్ష : అంచనాలను మించిన “రాజన్న”

విడుదల తేది :22 డిశంబర్ 2011
దర్శకుడు : విజయేంద్ర ప్రసాద్
నిర్మాత : నాగార్జున అక్కినేని
సంగిత డైరెక్టర్ : ఎం.ఎం. కీరవాణి
తారాగణం : నాగార్జున అక్కినేని, స్నేహ, ఏనీ, శ్వేతా మీనన్ మరియు ఇతరులు

కింగ్ నాగార్జున నటించిన యదార్థ గాధ “రాజన్న” రేపు తెర మీదకి రాబోతున్నది. ఈరోజు ప్రసాద్ లాబ్స్ లో ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఈ చిత్రానికి ప్రఖ్యాత కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించగా కీరవాణి గారు సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి పోరాట సన్నివేశాల పర్యవేక్షణ రాజమౌళి గారు చేసారు. ఈ చిత్రం ఎలా ఉందొ చూద్దాం.

కథ :

ఇంతకముందే నాగార్జున గారు ఈ కథని చెప్పటం వల్ల ఎక్కువ లోతుగా వెళ్ళట్లేదు. కాని కొత్త వారి కోసం కొంచెం పరిచయం .1950 ల కాలం లో ఆదిలాబాద్ జిల్లా నేలకొండపల్లి అనే గ్రామం లో జరిగిన కథ . ఈ చిత్ర కథా నేపథ్యం తండ్రికూతుళ్ళు అయిన రాజన్న(నాగార్జున) మరియు మల్లమ్మ(అన్నీ) లు మంచి వాళ్ళ కోసం చేసే పోరాటం చుట్టూ తిరుగుతుంది. మల్లమ్మ (అన్నీ) చిన్నప్పుడే తన తల్లి తండ్రులని(నాగార్జున & స్నేహ) కోల్పోతుంది. అదే గ్రామం లో ఒక ముసలాయన దగ్గర పెరుగుతూ ఉంటుంది. తనకు ప్రకృతి ఇచ్చిన వరం పాడటం తన పాటతో ఊరందరి మెప్పు పొందుతుంది. ఆ ఊరి దొరసాని(శ్వేతా మీనన్ ) కి మల్లమ్మ పాడటం నచ్చదు మళ్లీ తన పాట వినపడకూడదు అని హుకుం జారి చేస్తుంది. బయపడిపోయిన మల్లమ్మ పండిట్ జవర్హలాల్ నెహ్రు కి త ఊరి సమస్యలని చెప్పుకోటానికి బయలుదేరుతుంది.

కాని ఢిల్లీ లో కూడా దొరసాని మనుషుల వల్ల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటుంది. తన ఆశలు వదిలేసుకున్నాక , తన సంగీత గురువు (నాజర్ ) మల్లమ్మ తండ్రి రాజన్న కథ చెప్పుతాడు.అది విన్న మల్లమ్మ ఏం చేసింది? నెహ్రు గారిని కలిసిందా లేదా ? అనేదే కథా సారాంశం.

నటన:

మొదటగా మనం చెప్పుకోవాల్సింది మల్లమ్మ పాత్రలో నటించిన అన్నీ గురించి. తన నటన అద్బుతం , తన నటన వర్ణనాతీతం తన నటన గురించి చెప్పటానికి మాటలు సరిపోవుటలేదు. ఈ పాత్రకి అన్నీకి ఖచ్చితంగా అవార్డు వస్తుంది అనిపిస్తుంది.తరువాత చెప్పుకోవాల్సింది నాగార్జున గారి గురించి ఇలాంటి చిత్రం కథానుగుణంగా నడిపించటానికి చాలా ధైర్యం కావాలి కథ మీద నమ్మకంతో ఈ ప్రయోగం చేసిన నాగార్జున గారికి అభినందనలు.

మల్లమ్మ పాత్ర చేసిన అన్నీ అద్బుతం గా చేసింది. ముందే చెప్పినట్టు గా తన నటన వర్ణనాతీతం. తన నటనలో చాలా పరిపఖ్వత కనిపించింది. మల్లమ్మ పాత్ర లో హావభావాల ని అద్బుతం గా పలికించింది. తన పాత్ర జనానికి చేరువయ్యేలా చేసింది. మల్లమ్మ ఒక్కొక సమస్యని దాటుతూ వుంటే జనం పాత్ర లో లీనమయిపోతారు.

నాగార్జున రాజన్న పాత్రలో బాగా ఇమిడిపోయారు అయన ఆహార్యం ఆ పాత్ర కి అద్బుతం గా ఉంది . పోరాట సన్నివేశాలలో సంభాషణలను అద్బుతం గా పలికారు. స్నేహ, రాజన్న భార్య లచ్చమ్మ పాత్రలో పరిధి మేరకు బాగానే నటించింది.

శ్వేతా మీనన్ దొరసాని పాత్రలో ప్రతినాయిక పాత్ర పోషిచింది. నాజర్ మరియు గాంధీ వాళ్ళ పాత్ర మేరకు నటించారు. దిలావర్ ఖాన్ పాత్రలో సత్య నాగ్ బాగా నటించాడు. ముఖేష్ ఋషి ప్రతినాయకుడి పాత్రలో బాగా చేసారు. హేమ మరియు తెలంగాణ శకుంతల వారి పాత్ర మేరకు బాగా నటించారు. అజయ్,సుప్రీత్,శ్రావణ్ మరియు ప్రదీప్ రావత్ రాజన్న స్నేహితులుగా బాగా నటించారు.

ప్లస్ :

ఈ కథ నేపథ్యాన్ని అద్బుతంగా వీక్షకులు కథలో లీనమయిపోయెల చెప్పారు. “వేయరా వేయ్” పాట అద్బుతంగా చిత్రీకరించారు వీక్షకుల భావాలని హత్తుకునేల వుంది. ఈ పాటని నేలకొండపల్లి ప్రజలలో చైతన్యం తీసుకురాటానికి పాడుతారు ఈ పాట చివరకి వచ్చెసరికి వీక్షకుల భావాలు కూడా అలానే ఉంటుంది.

ధియేటర్ నుండి బయటకి వచ్చాక కూడా కొన్ని సన్నివేశాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆడవాళ్ళ అందాలకి పన్ను వేసే సన్నివేశం లో నాగార్జున గారి హావభావాలు, దొరసాని దగ్గర పని చేస్తున్న అబ్బాయి తిరుగుబాటు సన్నివేశం మరియు పతాక సన్నివేశాలు అద్బుతంగా ఉన్నాయి.

కీరవాణి గారి సంగీతం చిత్రా నేపధ్యానికి జీవం పోసింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే తారా స్థాయి లో ఉంది. పాటలు పాత్ర మరియు కథ నేపథ్యాన్ని అద్బుతంగా వ్యక్తపరిచాయి. “అమ్మ అవని” పాట చిత్రం లో కీలక సన్నివేశాలను ఎత్తి చూపేల ఉంది. కథ మరియు దర్సకత్వం లో విజయేంద్ర ప్రసాద్ గారు సఫలం అయ్యారు.రాజమౌళి గారి పోరాట సన్నివేశాలు చిత్రానికి బలం చేకూర్చాయి.

మైనస్ :

నాగార్జున గారి పరిచయ సన్నివేశాలు ఇంకొంచెం బాగా తీసి వుంటే బాగుండేది. గ్రాఫిక్స్ బాగోలేవు, కొన్న చారిత్రక విషయలను చిత్రానికి అనుగుణంగా మార్చుకున్నారు. పతాక సన్నివేశం తరువాత రాజన్న ఏమయ్యాడు అనే విషయాన్నీ సరిగ్గా చూపించలేదు. చిత్రం కొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతుంది.

సాంకేతిక విభాగం :

శ్యాం.కే.నాయుడు మరియు అనిల్ బండారి ల సినిమాటోగ్రఫీ కనువిందు చేస్తుంది, దృశ్యాలు చాల బాగా వచ్చాయి .కోటగిరి వెంకటేశ్వర రావు గారి ఎడిటింగ్ చాలా బాగుంది. రవీందర్ చేసిన ఆర్ట్ వర్క్ నిజమనిపించేల వుంది.

తీర్పు :

నేలకొండపల్లి ప్రజల కష్టాల నడుమ జరిగే ఒక పోరాటం “రాజన్న ” చిత్రం. బేబీ అన్నీ మరియు నాగార్జున ల నటన అద్బుతం. కీరవాణి గారి సంగీతం మరియు రాజమౌళి గారి పోరాట సన్నివేశాల చిత్రీకరణ ఈ చిత్రానికి మరింత బలం చేకూర్చాయి . ఈ చిత్రం లో మనస్సుని హత్తుకునేల చాలా సన్నివేశాలు వున్నాయి . ఇలాంటి కథా నేపథ్యాన్ని ఎంచుకొని ధైర్యం గా చిత్రీకరించిన నాగార్జున గారికి అభినందనలు తెలపాలి. ఈ చిత్రం తప్పకుండా చూడాల్సిన చిత్రం .

మహేష్ కె.ఎస్

అనువాదం – రv

123తెలుగు.కాం రేటింగ్:

రాజన్న చిత్రానికి మేము అఫీషియల్ మీడియా పార్టనర్ గా ఉన్నాము. మేము ప్రమోట్ చేసిన చిత్రానికి రేటింగ్ ఇవ్వడం సబబు కాదు. అందువల్ల ఈ చిత్రానికి మేము రేటింగ్ ఇవ్వడం లేదు. రాజన్న చిత్రం చాల బావుంది చూసి ఎంజాయ్ చేయండి.

Rajanna Review English Version

జనవరిలో ప్రారంభం కానున్న రజినీకాంత్ కొత్త చిత్రం


రజినికాంత్ నటించబోయే తరువాత చిత్రం ‘కొచ్చడయాన్’. ఈ చిత్రం జనవరి 2 నుండి చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం. రజినికాంత్ ‘రాణా’ సినిమాలో నటించాల్సి ఉండగా ఆయన అనారోగ్యం పాలవడంతో ఆ చిత్రం ఆగిపోయింది. ప్రస్తుతానికి రాణా చిత్రాన్ని పక్కన పెట్టి నూతన చిత్రానికి శ్రీకారం చుట్టారు. కొచ్చడయాన్ చిత్రానికి రజినికాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రం కోసం కే.ఎస్. రవి కుమార్ కథ అందించనున్నారు. రజినికాంత్ సరసన నటించడానికి అనుష్క మరియు అసిన్ లను సంప్రదించినట్లు సమాచారం. ఈ చిత్రం కోసం ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నారు. కొచ్చడయాన్ కి ఛాయాగ్రాహకుడిగా రాజీవ్ మీనన్ పని చేయబోతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కి సంబందించిన భాద్యతలు కూడా ఈయనే చూసుకుంటాడని సమాచారం.

50 రోజులు పూర్తి చేసుకున్న నువ్విలా


నూతన నటీ నటులతో రవిబాబు తీసిన చిత్రం ‘నువ్విలా’. ఈ చిత్రం మంచి విజయం సాధించి నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. రవి బాబు గతంలో నూతన నటులతో ‘నచ్చావులే’ చిత్రం తీసి విజయం సాధించారు. ఆ చిత్రంలో తనీష్ మరియు మాధవీ లత లను తెలుగు తెరకు పరిచయం చేసారు. ఇక నువ్విలా విషయానికి వస్తే హవీష్, అజయ్, ప్రసాద్ బార్వి, విజయ్ సాయి, యామి గౌతమ్, సరయు, రమ్య కొత్త నటులను పరిచయం చేసారు. నూతన నటులను ప్రోత్సహించే రామోజీ రావు గారు ఈ చిత్ర నిర్మాత. నువ్విలా మరియు నచ్చావులే రెండు చిత్రాలకు ఆయనే నిర్మించడం విశేషం. నువ్విలా చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

రాజన్న చిత్ర విజయం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు శుభ పరిణామం

యదార్ధ సంఘటనల ఆధారంగా కింగ్ అక్కినేని నాగార్జున నటించిన చిత్రం ‘రాజన్న’. ఈ చిత్రం ఈ రోజు విడుదలవుతుండగా నిన్న ఈ చిత్రాన్ని ప్రముఖలకు ప్రిమియర్ షో వేయడం జరిగింది. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాల బావుందని నాగార్జున గారి కెరీర్లో మర్చిపోలేని చిత్రం అవుతుందని చెప్పారు.రాజన్న చిత్ర విజయంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మంచి శుభ పరిణామం. ఈ సంవత్సరం మొదటి భాగంలో ఎక్కువ విజయాలు లేకపోయినప్పటికీ ద్వితీయార్ధం మాత్రం మంచి విజయాలు దక్కాయి. అగ్ర హీరోలు కూడా విజయాలు దక్కించుకున్నారు. ‘శ్రీ రామ రామ రాజ్యం’ తో బాలకృష్ణ విజయం సాధించగా, ‘రాజన్న’ తో నాగార్జున పెద్ద విజయం సాధించారు. ‘దూకుడు’ తో మహేష్ భారీ హిట్టే సాధించారు.

ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర రికార్డుల మోత మోగించింది. ఎన్టీఆర్ నటించిన ‘ఊసరవెల్లి’ తో పర్వాలేదనిపించాడు. ఈ చిత్రం నిర్మాతకు నష్టాలు రాకుండా బయట పడింది. నవతరం నటులు రామ్ మరియు నారా రోహిత్ ‘కందిరీగ’ మరియు ‘సోలో’ చిత్రాలతో మంచి విజయాలు దక్కించుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైలిష్ చిత్రం ‘పంజా’ తో పర్వాలేదనిపించాడు. అల్లు అర్జున్ ‘బద్రీనాథ్’ తో కమర్షియల్ విజయం సాదించాడు. ఈ విజయాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ కలకలాడుతోంది. వచ్చే ఏడాది కూడా ఇంత కంటే భారీ విజయాలు సాధించాలని కోరుకుందాం.

సమీక్ష 2 : అదరగొట్టిన రాజన్న

విడుదల తేది :22 డిశంబర్ 2011
దర్శకుడు : విజయేంద్ర ప్రసాద్
నిర్మాత :  నాగార్జున అక్కినేని
సంగిత డైరెక్టర్ : ఎం.ఎం. కీరవాణి
తారాగణం : నాగార్జున అక్కినేని, స్నేహ, ఏనీ, శ్వేతా మీనన్ మరియు ఇతరులు

రగడ వంటి కమర్షియల్ హిట్ కొట్టి ఆ తరువాత గగనం వంటి ప్రయోగాత్మక చిత్రం చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నాగార్జున ప్రముఖ రచయిత మరియు రాజమౌళి తండ్రి గారు అయిన విజయేంద్ర ప్రసాద్ గారి దర్శకత్వంలో రాజన్న చిత్రం చేసారు. అగ్ర దర్శకుడు రాజమౌళి కీలక సన్నివేశాలకు మరియు యాక్షన్ సన్నివేశాలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రేక్షకుల తీర్పు కోరుతూ మన ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉందొ చూద్దాం.

కథ:

రాజన్న చిత్ర కథ 1950లో ఆదిలాబాద్ జిల్లా లోని నేలకొండపల్లి అనే గ్రామంలో మొదలవుతుంది. నేలకొండపల్లిలో ఉండే మల్లమ్మ (ఏనీ) ని ఒక పెద్దయన అల్లారుముద్దుగా పెంచుతాడు. మల్లమ్మకి పాటలంటే ఎంతో ఇష్టం. మల్లమ్మని బడిలో చేర్పించడానికి ఆ ఊరిలో ఉండే దొరసాని అనుమతి కోసం వెళ్తారు. అక్కడ పాట పాడి దొరసాని ఆగ్రహానికి గురవుతుంది. మళ్లీ పాట పాడితే చంపేస్తానని హుకుం జారీ చేస్తుంది. ఒకానొక సందర్భంలో మల్లమ్మ అనుకోకుండా పాట పాడితే మల్లమ్మని పెంచిన పెద్దాయనని చంపేస్తుంది దొరసాని. మల్లమ్మని కూడా చంపబోతే సంగీతం మాస్టారు (నాజర్) కాపాడతాడు. దొరసాని బాధల నుండి నుండి తన ఊరికి విముక్తి లభించాలంటే డిల్లీలో ఉన్న ప్రధాన మంత్రి నెహ్రు గారి వల్ల మాత్రమే అవుతుంది అని తెలుసుకొని కాలినడకన డిల్లి కి వెళుతుంది. మల్లమ్మ డిల్లీలో ఉన్న విషయం దొరసానికి తెలుసుకుని మల్లమ్మని బందిస్తుంది. దొరసాని నుండి ఎలా ప్రాణాలు కాపాడుకోవాలో తెలియక ఏడుస్తున్న మల్లమ్మ కి “రాజన్న” వీర గాధ ని సంగీతం మాస్టారు చెబుతాడు. ఇంతకు రాజన్న ఎవరు. ఆయనకి మల్లమ్మకి ఉన్న సంబంధం ఏమిటి. మల్లమ్మ నెహ్రు ని కలిసిందా లేదా అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్:

మల్లమ్మ పాత్రలో నంటించిన ఏనీ చాలా అధ్బుతంగా నటించింది. మల్లమ్మ పాత్రని ఏనీ తప్ప ఇంకెవరు ఇంకెవరు చేయలేరు అనిపించేలా చేసింది. పాటల్లో తన అభినయం చాలా బావుంది. తన అమాయకత్వం కలగలిసిన నవ్వుతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకునేలా చేస్తుంది. మల్లమ్మ పాతకి ఏనీ కి అవార్డులు గెలుచుకుంటుంది. రాజన్న పాత్రలో నాగార్జున చాలా బాగా చేసిరు. సినిమాలో నాగార్జునని కాకుండా రాజన్నని మాత్రమే చూస్తాం. వెయ్ వెయ్ పాటలో నాగ్ నటన అధ్బుతం. మరియు 200 మంది రాజకార్లతో పోరాడే సన్నివేశాలు ఆయన అభిమానుల్ని అలరిస్తాయి. లచ్చువమ్మ గా స్నేహ బాగా చేసింది. రజకారులు తన అవమానిస్తే బరిసేతో చంపే సన్నివేశంలో అమ్మవారి అవతరంలా కనిపిస్తుంది. దొరసాని గా నటించిన శ్వేతా మీనన్ బాగా నటించింది. మల్లమ్మని పెంచిన పెద్దాయన మరియు సంగీతం మాస్టారిగా బాగా చేసారు. దిలావర్ ఖాన్ గా సత్య దేవ్, ముఖేష్ రుషి, రవి కాలే, హేమ, తెలంగాణా శకుంతల, విజయ్ కుమార్ తమ పాత్ర పరిధిలో నటించారు. రాజన్న స్నేహితులుగా అజయ్, సుప్రీత్, శ్రవణ్, ప్రదీప్ రావత్ బాగానే చేసారు.

మైనస్ పాయింట్స్:

నాగార్జున మొదటిసారి తెరపై కనిపించే సన్నివేశంలోని ఇంకా బాగా తీసి ఉంటే బావుండేది. ఆ సన్నివేశంలో డైలాగులు కూడా సరిగా పండలేదు. చిత్రం మొత్తం పూర్తి తెలంగాణ యాసలో ఉండటం వలన తెలంగాణేతర ప్రజలకి భాష విషయంలో కొంత గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉంది. రాజన్న పాత్రకి ముగింపు సరిగా ఇవ్వకపోవడం కూడా కొంత భాధ కలిగిస్తుంది.
చిత్ర మొదటి భాగంలో 7పాటలు ఉండటం, కామెడీ సన్నివేశాలు లేకపోవడంతో అక్కడక్కడ బోర్ అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం:

శ్యాం కె నాయుడు, శ్యాం బండారి, పూర్ణ అందించిన సినిమాటోగ్రఫీ బావుంది. నేలకొండపల్లి గ్రామలో సన్నివేశాలు చాలా సహజంగా చూపించారు. రాజమౌళి ప్రతి సినిమాకు ఎడిటర్ గా పని చేసే కోటగిరి వెంకటేశ్వర రావు గారు ఈ సినిమాను కూడా బాగా ఎడిట్ చేసారు. రాజమౌళి గారి ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి తన సంగీతంతో మేజిక్ చేసారు. పాటలతో ప్రేక్షలను ఉర్రూతలూగిస్తే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాకి ప్రాణం పోసారు. లచ్చువమ్మ పాటకి శివ శంకర్ కొరియోగ్రఫీ బావుంది. ఫైట్స్ సినిమాకి హైలెట్. విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం కూడా చాలా బావుంది.

తీర్పు:

రాజన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని చిత్రంలో లీనమయ్యేలా చేస్తుంది. చిత్ర మొదటి భాగం ఏనీ అధ్బుత నటన తో అలరిస్తే, రెండవ భాగం నాగార్జున గారి నటనతో సినిమా హైలెట్ చేసారు.
ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నచ్చుతుంది. ఈ చిత్రం తప్పకుండా చూడండి.

అశోక్ రెడ్డి. ఎమ్

123తెలుగు.కాం రేటింగ్:
రాజన్న చిత్రానికి మేము అఫీషియల్ మీడియా పార్టనర్ గా ఉన్నాము. మేము ప్రమోట్ చేసిన చిత్రానికి రేటింగ్ ఇవ్వడం సబబు కాదు. అందువల్ల ఈ చిత్రానికి మేము రేటింగ్ ఇవ్వడం లేదు. రాజన్న చిత్రం చాల బావుంది చూసి ఎంజాయ్ చేయండి.

Rajanna Review English Version

ఈరోజు ఎం.ఎస్. రెడ్డి గారి పెద్ద ఖర్మ

ప్రఖ్యాత కవి మరియు చిత్ర నిర్మాత ఎం.ఎస్. రెడ్డి గారి పెద్ద ఖర్మ ఈ రోజు జూబ్లీ హిల్స్ క్లబ్ లో జరిగింది.

పుట్టిన రోజు జరుపుకొంటున్న తమన్నా

ఈ తరం కథానాయికల లో “మిల్క్ వైట్ బ్యూటి” గా పేరొందిన ఒకే ఒక తార తమన్నా.

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దమ్ము


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘దమ్ము’. ఈ చిత్రం పవర్ఫుల్ డైలాగ్స్ మరియు అధ్బుతమైన యాక్షన్ సన్నివేశాలతో రూపుదిద్దుకుంటుందని సమాచారం. బోయపాటి శీను ఫాన్స్ కి విందు భోజనం అందించాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్టీఆర్ కి జోడీగా త్రిషా మరియు కార్తీక నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పలు విభిన్నమైన పాత్రలో మరియు త్రిషా మూడు విభిన్నమైన గెటప్ లో కనిపిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోలో 4 పాటలు రికార్డింగ్ పూర్తయింది.ఈ పాటలు చాలా బావున్నాయని రాజమౌళి కూడా చెప్పడం జరిగింది.

రామోజీ ఫిలిం సిటీలో రచ్చ


మెగా పవర్ స్టార్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘రచ్చ’. ప్రస్తుతం ఈ చిత్రం రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక్కడే చిత్రంలోని ముఖ్య నటీ నటులతో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో అందాల భామ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. చిరంజీవి గారి ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘వాన వాన వెల్లువాయే’ పాటను రీమిక్స్ చేసి ఈ చిత్రంలో. సంపత్ నంది దర్శకత్వం వహిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.పరాస్ జైన్ మరియు ఎన్.వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ఆర్.బి చౌదరి సమర్పిస్తున్నారు. ఇటీవలే బ్యాంకాక్, చైనా, శ్రీలంకలో కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. రచ్చ శరవేగంగా పూర్తి చేసి మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అభిమానులను ఆనంద పరుస్తున్న బిజినెస్ మాన్ ఆడియో


ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉన్నారు. ఈ సంవత్సరం “దూకుడు” లాంటి భారి చిత్రాన్ని అందించిన మహేష్ బాబు ఇప్పుడు మళ్లి రికార్డ్లు లు బద్దలు కొట్టడానికి “బిజినెస్ మాన్ ” గా వస్తున్నాడు. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక ఈ నెల 22 న భారిగా జరగనుండగా ఈ చిత్రం లో అన్ని పాటల టీజర్స్ ని విడుదల చేసారు. ఈ పాటలు బయటకి వచ్చినప్పటి నుండి అభిమానులు ఆనందం ఎక్కువయ్యింది ఒక భారి విజయానికి కావలసిన అన్ని విషయాలు ఈ చిత్ర సంగీతం లో ఉందని అభిమానులు అంటున్నారు. సామాన్య ప్రజలు కూడా ఈ చిత్ర సంగీతాన్ని బాగా ఆహ్వానించారు. నిన్న ట్విట్టర్ మరియు పేస్ బుక్ మొత్తం బిజినెస్ మాన్ మానియా నడిచింది.

మహేష్ బాబు అభిమానుల్లో ఒకరయిన రాకేశ్ చిత్ర ఆడియో గురించి చెపుతూ ” ‘సార్ వస్తార’ పాట అద్బుతంగా ఉందని, ‘ఆమ్చి ముంబై ‘ పాట జనానికి చేరువయ్యే పాట అని అన్నారు”. ఇంత మంచి ఆల్బం ఇచినందుకు పూరి గారికి మరియు తమన్ గారి కృతజ్ఞతలు తెలుపుతూ పూర్తి పాటలు కోసం చాల ఆసక్తి గ వేచి చూస్తున్నామని చెప్పారు.

మేము ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక ను రేపు నేరుగా వేదిక నుండి “లైవ్ అప్డేట్స్” ఇస్తాము. బిజినెస్ మాన్ గురించి మరి కొన్ని ఆసక్తికరమయిన విషయాల కోసం మా సైట్ ని ఫాలో అవ్వండి.

మంచి కారణం కోసం రాజన్న ప్రదర్శనలు

అక్కినేని నాగార్జున గారు నటించిన “రాజన్న” చిత్రం డిసెంబర్ 22 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.

కల్కిలా రాబోతున్నబాలకృష్ణ ?

ఇప్పుడు పరిశ్రమలో వచ్చిన పుకారుల ప్రకారం రాబోతున్న బాలకృష్ణ చిత్రానికి “కల్కి” అనే పేరు ని ఖరారు చేసినట్ట్టు తెలుస్తుంది.

ఏ. ఆర్. రెహమాన్ ప్రదర్శన ని నిరాకరించిన పురావస్తు శాఖ

ఏ. ఆర్. రెహమాన్ మరియు గౌతం మీనన్ ల కలయిక లో వస్తున్న చిత్రం “ఏక్ దీవానా థా”

సి. సి. ఎల్ కాన్సెప్ట్ ని నమ్ముకున్న శ్రియ

సి. సి. ఎల్ కాన్సెప్ట్ మీద నటి శ్రియ బాగా నమ్మకం పెట్టుకున్నట్టు కనిపిస్తుంది.

అప్డేట్ : బిజినె మేన్ ట్రాక్ లిస్ట్

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన బిజినెస్ మేన్ చిత్రంలోని ట్రాక్ లిస్ట్ మరియు పాటలు పాడిన వారి సమాచారం తో సహా మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం. తమన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఈ నెల 22న భారీగా విడుదల కాబోతుంది. మహేష్ బాబు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది

పాట: ఆమచ్చి ముంబై
పాడిన వారు: ఆలాప్ రాజు, నవీన్ మాధవ్, నవీన్

పాట: సార్ వస్తారోస్తరా
పాడిన వారు: సుచిత్ర, తమన్

పాట: చందమామ
పాడిన వారు: హరిచరణ్

పాట: పిల్లా చావ్
పాడిన వారు: రాహుల్ నంబియార్

పాట: బాడ్ బాయ్స్
పాడిన వారు: ప్రియా హేమేష్, గీతా మధురి

పాట: బిజినెస్ మేన్ థీమ్
పాడిన వారు: మహేష్, పూరి జగన్నాధ్, కోరస్.

 

అన్ని పాటలకి భాస్కరభట్ల రవి కుమార్ సాహిత్యం అందించారు.

బ్యాంకాక్ వెళ్తున్న వారధి


ప్రముఖ రచయిత కొరటాల శివ దర్శకుడి అవతారం ఎత్తారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వారధి’. యంగ్ రెబల్ స్టార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర యూనిట్ కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం బ్యాంకాక్ వెళ్లనుంది. ప్రభాస్ ఈ చిత్రంలో సరి కొత్త లుక్ లో కనిపించనున్నారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ప్రభాస్ సరసన అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ నటిస్తున్న విషయం తెలిసిందే. వారధి చిత్రాన్ని యూ.వి. క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్ ఉప్పలపాటి మరియు వంశీ కృష్ణా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఈ చిత్రం లోనే కాకుండా లారెన్స్ డైరెక్షన్లో ‘రెబల్’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రభాస్ ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక రాజమౌళి తో ఒక సినిమా
చేయనున్నారు.

ఊ కొడతారా ఉలిక్కి పడతారా షూటింగ్ లో పాల్గొంటున్న సోను సూద్


తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటుడిగా పేరు తెచ్చుకున్న సోను సూద్ ఎన్నో చిత్రాలలో నటించారు. ప్రస్తుతం ఆయన మంచు లక్ష్మి నిర్మిస్తున్న ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్రంలో నటించబోతున్నాడు. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మంచు లక్షి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆమె సోదరుడు అయిన మంచు మనోజ్ నటిస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ గారు ముఖ్య అతిధి పాత్రలో నటిస్తున్నారు. దీక్షా సేథ్ మరియు పంచి బొరా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రోజు నుండి సోను సూద్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.శేఖర్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి హైదరాబాద్ శివార్లలో ఒక భారీ సెట్ వేసి చిత్ర ముఖ్య భాగం అక్కడే చిత్రీకరిస్తున్నారు. సోను సూద్, ప్రభు, రిషి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

బాక్స్ ఆఫీస్ బాబు రావు రాజన్న విశ్లేషణ


హలో ఫ్రెండ్స్, రాజన్న చిత్రం గురించిన మొత్తం సమాచారం అందించడానికి త్వరలో బాక్స్ ఆఫీస్ బాబూ రావు మీ ముందుకు రాబోతున్నాడు.అతను మీతో లైవ్ చాట్ చేస్తూ అందుబాటులో ఉంటాడు. మీకు ఏమైనా సందేహాలుంటే అతనిని అడగవచ్చు. రాజన్న చిత్రానికి సంబందించిన తాజా సమాచారాన్ని సంక్షిప్తంగా మీకు అందిస్తాడు. ఏ థియేటర్ జనాలతో నిండిపోయింది, అక్కడ వారి రెస్పాన్స్ ఎలా ఉంది మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తుంటాడు. ఇంకా చాలా విషయాలు మీతో లైవ్ చాట్ చేస్తూ వార్తలు, ఫోటోలు, వీడియోలు అందిస్తాడు. అతను మీకు నచ్చిన హీరో, నచ్చిన సినిమా గురించి సమగ్ర సమాచారం ఇస్తాడు. డిసెంబరు 22వ తారీఖున ఉదయం 8:45 గం.ల నుండి బాక్స్ ఆఫీస్ బాబూ రావు లైవ్ లో మీకోసం ఉంటాడు. సిద్ధంగా ఉండండి.

నోట్: ఈ పాత్ర కేవలం కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించినది కాదు.

60 వసంతాలు పూర్తి చేసుకున్న మల్లీశ్వరి


తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మైలురాయి లాంటి చిత్రాలు కొన్ని ఉంటాయి. అలాంటి చిత్రాలలో ‘మల్లీశ్వరి’ ఒకటి. నేటితో ఆ చిత్రం 60 వసంతాలు పూర్తి చేసుకుంది.తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు వచ్చిన గొప్ప చిత్రాలలో మల్లీశ్వరి కూడా ఒకటి. ఇలాంటి చిత్రం ఇక ముందు కూడా ఎవరు తీయలేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మల్లీశ్వరి చిత్రానికి గొప్ప దర్శకుడు బిఎన్. రెడ్డి గారు దర్శకత్వం వహించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అగ్ర నటుడు నందమూరి తారక రామారావు గారు నాగరాజు పాత్రలో మరియు భానుమతి గారు మల్లీశ్వరి పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సాలూరి రాజేశ్వర రావు గారు సంగీతం అందించగా దేవులపల్లి కృష్ణ శాష్త్రి గారు సాహిత్యం అందించారు. మల్లీశ్వరి చిత్రంలో మొత్తం 15 పాటలున్నాయి.

మల్లీశ్వరి చిత్ర కథ విషయానికి వస్తే పురాతన కాలంలో రాణివాసం అనే ఆచారం ఉంటుంది. రాణివాసం చేసిన యువతి రాజు గారి కోటలో శాశ్వతంగా ఉండిపోవాలని బయట మగాళ్ళను ఎవ్వరిని కలుసుకోకూడదు అనే నిబందన ఉంటుంది. మల్లీశ్వరి (భానుమతి) అనే యువతి తల్లి తండ్రులు డబ్బు కోసం బలవంతంగా మల్లిశ్వరిని రాణివాసానికి పంపిస్తారు. భానుమతి తన బావ నాగరాజు (ఎన్టీఆర్) ప్రేమించుకుంటారు. భానుమతిని రాణివాసానికి పంపడంతో నాగరాజు భానుమతిని కలుసుకోవడానికి రాజు గారి కోటకు వెళ్లి అక్కడ పట్టుబడతాడు. నాగరాజుకి శిక్ష విధించడానికి శ్రీ కృష్ణ దేవరాయల వారి దగ్గరికి తీసుకు వెళ్తారు. అక్కడ వీరి ప్రేమకథ విన్న శ్రీ కృష్ణ దేవరాయల వారు ఏం చేశారన్నది మిగతా చిత్ర కథ.

మల్లీశ్వరి చిత్రంలో ప్రతి ఒక్కరు అధ్బుతంగా నటించారు. పాటలు క్లాసిక్స్ గా మిగిలిపోగా ఈ చిత్రం కొన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందొంది. ఒకప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇలాంటి చిత్రాలతో ఎంతో ఖ్యాతి గడించింది.

123తెలుగు.కామ్ తరపున ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మల్లీశ్వరి చిత్ర యూనిట్ సభ్యులకు జోహార్లు.

మెహెర్ రమేష్ చిత్రంలో వెంకీ-జగపతి బాబు


విక్టరీ వెంకటేష్ నటించబోయే కొత్త చిత్రానికి మెహెర్ రమేష్ దర్శకత్వం వహించాబోతుండగా పరుచూరి ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఒక కీలక పాత్రను జగపతి బాబు పోషిస్తున్నట్లు సమాచారం. వెంకీ కి జంటగా రిచా గంగోపాధ్యాయ నటిస్తుంది. వచ్చే ఏడాది జనవరి నుండి ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి స్క్రిప్టు మరియు డైలాగ్స్ కోన వెంకట్ అందిస్తున్నారు. మల్టి స్టారర్ చిత్రాలు చేయడంలో ముందుండే జగపతి బాబు తారకరత్న హీరోగా నటిస్తున్న నందీశ్వరుడు చిత్రంలో కూడా ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. శక్తి చిత్ర పరాజయం తరువాత మెహెర్ రమేష్ కి ఈ చిత్రం కీలకం కానుంది.

రాజన్న చిత్రంలో అక్కినేని నాగేశ్వర రావు వాయిస్ ఓవర్

‘రాజన్న’ చిత్రం అన్ని హంగులతో ఈ నెల 22న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంభందించి మాకు ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. సీనియర్ యాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు గారు ఈ చిత్రం కోసం తన గొంతును వినిపించినట్లు సమాచారం.చిత్రం మొదలయ్యే సమయంలోని కొన్ని కీలక సన్నివేశాలకు ఏఎన్నార్ గారు తన వాయిస్ ఓవర్ అందించారు. నిన్న అక్కినేని నాగార్జున గారి కుటుంబసభ్యులకు కోసం ప్రసాద్ లాబ్స్ లో ప్రివ్యు షో వేయడం జరిగింది. ఈ ప్రివ్యు చూసిన వారు చిత్రం చాలా బావుందని చెప్పారు. రాజన్న చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున గారే స్వయంగా నిర్మించడం జరిగింది. రాజన్న చిత్రం నాగార్జున గారి కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని
చిత్ర యూనిట్ వర్గాలు చెప్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇప్పటికే మార్కెట్లో విడుదలై విశేష ఆదరణ లభించింది.విజయేంద్ర ప్రసాద్ గారు దర్శకత్వం అందించగా స్నేహ నాగార్జున భార్యగా నటిస్తుంది. ఏనీ అనే పాప రాజన్న కూతురిగా ముఖ్య పాత్రలో నటిస్తుంది.

మీ కోసం ప్రత్యేకమైన కాంటెస్ట్. రాజన్న చిత్ర ఉచిత టికెట్స్ గెలవాలనుకుంటున్నారా.ఇక్కడ క్లిక్ చేయండి

రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న నా ఇష్టం

దగ్గుబాటి రానా తెలుగులో నటిస్తున్న చిత్రం ‘నా ఇష్టం’.

నందీశ్వరుడు చిత్రం విడుదల వాయిదా

నందీశ్వరుడు చిత్రం ఈ శుక్రవారం విడుదల అవ్వాల్సి వుంది.

సెన్సార్ సర్టిఫికేట్ అందుకున్న రాజన్న

 

కింగ్ నాగార్జున నటించిన రాజన్న చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

అల్యుమీనియం ఫాక్టరీలో ఫైట్స్ చేస్తున్న ఎన్టీఆర్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రం ‘దమ్ము’ షూటింగ్ వేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇటీవలే గచ్చిబౌలి లోని అల్యుమీనియం ఫాక్టరీలో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. బోయపాటి శీను మరియు ఎన్టీఆర్ ఈ చిత్ర విజయం సాధించేలా తెరకెక్కిస్తున్నారు. దమ్ము చిత్రాన్ని అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తుండగా త్రిషా మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా మరియు కార్తీక రెండవ హీరోయిన్ గా నటిస్తున్నారు. పవర్ఫుల్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోలిస్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. దమ్ము చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

బిజినెస్ మేన్ కొత్త ట్రైలర్ లో మూడు పంచ్ డైలాగ్స్


దూకుడు భారీ విజయం తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న ఎంటర్టైనర్ చిత్రం ‘బిజినెస్ మేన్’ అన్ని హంగులతో జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకి సిద్ధమవుతుంది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబందించిన ఇటీవలే రెండు ట్రైలర్స్ విడుదలైన విషయం తెల్సిందే. ఈ నెల 22న విడుదలవుతున్న ‘రాజన్న’ ప్రదర్శితమవుతున్న థియేటర్లలో మరో సరి కొత్త ట్రైలర్ ను ప్రదర్శించబోతున్నారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ ట్రైలర్ లో మూడు పంచ్ డైలాగ్స్ ఉన్నట్లు సమాచారం. పూరి జగన్నాధ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ పై భారీ అంచనాలున్నాయి. అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. బిజినెస్ మేన్ చిత్రాన్ని వెంకట్ నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందించిన ఆడియో ఈ నెల 22న శిల్ప కళా వేదికలో విడుదల కాబోతుంది.

రచ్చలో మెడికల్ స్టూడెంట్ గా కనిపించబోతు​న్న చరణ్?


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘రచ్చ’ లో మెడికల్ స్టూడెంట్ గా నటించాబోతున్నడా? రామ్ చరణ్ మరియు తమన్నా ఇద్దరు మెడికల్ స్టూడెంట్స్ గా నటిస్తున్నారు అంటున్నాయి ఫిలిం నగర్ ఇండస్ట్రీ వర్గాలు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం తిరుపతిలో షూటింగ్ జరుపుకుంటుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్.బి. చౌదరి నిర్మిస్తున్నారు. ఇటీవలే చైనా, శ్రీలంక, బ్యాంకాక్ లలో కీలక పోరాట సన్నివేశాలు తెరకెక్కించారు. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం గోవా లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక పెద్ద ప్రమాదం నుండి చరణ్ బయట పడిన విషయం తెలిసిందే. రచ్చ లో తమన్నా మరో సారి అందాల ఆరబోత చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

విదేశాలలో సబ్ టైటిల్స్ తో ప్రదర్శితం కానున్న రాజన్న


తెలుగు సినిమా కొత్త హంగులతో సిద్ధమవుతోంది. కింగ్ అక్కినేని నాగార్జున నటించిన ‘రాజన్న’ చిత్రం విదేశాలలో ప్రదర్శితమయ్యే ప్రింట్స్ లో సబ్ టైటిల్స్ తో ప్రదర్శితం కానుంది. నిర్మాణ సభ్యులు ఈ విషయాన్ని స్వయంగా మాకు తెలిపారు. అన్ని భాషల వారికీ సులువుగా అర్ధమయ్యే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డిసెంబరు 21న విదేశాలలో ప్రీమియర్ షోస్ వేయాలని నిర్ణయించినట్లు, ప్రింట్స్ కూడా పంపించడం జరిగిందని చెప్పారు. ఈ చిత్రాన్ని విదేశాలలో నాగార్జున గారే స్వయంగా విడుదల చేయబోతున్నారు. రాజన్న చిత్రాన్ని విదేశాలలోని కొన్ని ప్రాంతాలలో నాగార్జున గారు ‘అన్నపూర్ణ స్టూడియోస్ ఇంటర్నేషనల్ ఐఎన్సీ’ ద్వారా భారీ గా విడుదల చేయబోతున్నారు. నాగార్జున మరియు ఇతర నిర్మాణ సభ్యులు రాజన్న చిత్రం నాగార్జున గారి కెరీర్లో మర్చిపోలేని చిత్రం అవుతుంది అని నమ్మకం వ్యక్తం చేసారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు దర్శకత్వం వహించగా ఆయన గారి అగ్ర దర్శకుడు అయిన రాజమౌళి గారు కొన్ని కీలక సన్నివేశాలకు దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున గారు ఈ చిత్రాన్ని నిర్మించారు.

మళ్ళీ వాయిదా పడిన ఉదయ్ కిరణ్ సినిమా

ఉదయ్ కిరణ్ మరియు శ్వేత బసు ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంట’

అనుకోకుండా హీరోయిన్ ని అయ్యాను అంటున్న అమలా పాల్

నేను సినిమాల్లోకి అనుకోకుండా వచ్చానని కానీ ఒక సారి నిర్ణయం తీసుకున్నాక బాగా చేయడానికి ప్రయత్నిస్తాను అంటోంది

కొత్త దర్శకులకి శుభారంభాన్నిచ్చిన 2011 సంవత్సరం

 

ఈ 2011 సంవత్సరం చివరికి చేరుకుంది. ఈ సంవత్సరంలో కొంతమంది నూతన దర్శకులు తెలుగు తెరకు పరిచయమయ్యారు.

రాజన్న చిత్రంలోని ఏనీ ని పొగుడుతున్న నాగార్జున

రాజన్న చిత్రంలో అందరి కంటే మల్లమ్మ పాత్రే ముఖ్యమైనది మరియు కీలకమైనదని నాగార్జున వెల్లడించారు.

సిసిఎల్ లో పాల్గొననున్న రిచా

అందాల భామ రిచా గంగోపాధ్యాయ సెలిబ్రిటీ క్రికెట్ లీగ్ రెండవ భాగానికి (సిసిఎల్) కి కర్టెన్ రైసర్ గా చేయబోతుంది.